రోజూ డైట్ సోడా తాగే అలవాటుందా? అయితే మీరు గుడ్డివారవడం పక్కా.. ఎందుకంటే..?
తాజా అధ్యయనం ప్రకారం.. రెగ్యులర్ గా డైట్ సోడాను తాగే అలవాటున్న వారికి కళ్లు దెబ్బతింటాయని.. ఆ సమస్యకు సకాలంలో చికిత్స తీసుకోకపోతే కళ్లు పూర్తిగా కనిపించవంటున్నారు శాస్త్రవేత్తలు.
డైట్ సోడా కళ్లకు చాలా ప్రమాదకరమని ఒక పరిశోధన తెలుపుతోంది. డైట్ సోడాను మితిమీరి తీసుకునే వారికి డయాబెటీస్ రెటినోపతి అనే సమస్య వస్తుందని ఓ అధ్యయనం తెలియజేస్తోంది. ఈ డయాబెటీస్ రెటినోపతి కంటి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు.
వారానికి 1.5 లీటల్ల శీతల పానీయాలను తాగే వారిలో ఈ డయాబెటీస్ రెటినోపతి ప్రమాదం రెండు రెట్లు పెరుగుతుందని అధ్యయనంలో కనుగొన్నారు.
Clinical and Experimental Ophthalmology జర్నల్ లో ప్రచురించబడిన 2018 పరిశోధన అధ్యయనం ప్రకారం.. నాన్ ఆల్కహాలిక్ శీతల పానీయాలు కంటి ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తాయని వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రకారం.. వారానికి 1.5 లీటర్ల శీతల పానీయం తాగడం వల్ల రెండు రెట్లు డయాబెటీస్ రెటినోపతి ప్రమాదం పెరుగుతుంది.
కాగా ఈ అధ్యయనాన్ని 609 మంది పెద్దలపై చేశారు. వీరి సగటు వయసు 65 సంవత్సరాలు. అయితే వీరిలో 73 మందికి టైప్ 1 డయాబెటీస్ ఉంటే.. టైప్ 2 డయాబెటీస్ 510 మందికి ఉన్నది. ఇంకా 26 మంది గురించి సమాచారం స్పష్టంగా లేదు.
ఇక ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో 46.8 శాతం మంది రెగ్యులర్ గా శీతల పానీయాలను తాగితే.. మిగిలిన వారు మాత్రం డైట్ సోడాలను తాగారు. అయితే శీతల పానీయాలు తాగేవారికంటే డైట్ సోడాలను తాగే వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనం కనుగొంది.
ఈ డయాబెటీస్ రెటినోపతి అనేది డయాబెటీస్ వల్ల తలెత్తుతుంది. దీనిలో వీరి రక్తంలో చక్కెర స్థాయిలు విపరీతంగా పెరిగి కంటిలోని రెటీనా దెబ్బతింటుంది. అంటే దీనివల్ల కంటిచూపు మందగిస్తుంది. ఈ వ్యాధి ప్రమాదాన్ని అలాగే వదిలిస్తే మీరు పూర్తిగా చూపు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అందుకే డయాబెటీస్ రోగులు ఏవైనా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్టైతే రెగ్యులర్ గా కంటి చెకప్ లను చేయించుకోవాలని నిపుణులు సిఫారసు చేస్తున్నారు. ఈ వ్యాధి ఎక్కువగా టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ పేషెంట్లకు వస్తుంది.
డయాబెటీస్ శరీరంలోని రక్తనాళాలను దెబ్బతీస్తుంది. వీరి రక్తంలో షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరిగినప్పుడు శరీరంలోనిన వివిధ అవయవాలకు కనెక్ట్ అయి ఉండే రక్తనాళాలను నిరోధిస్తుంది. కంటిలోని రక్తనాళాలపై కూడా ఈ ప్రభావం పడుతుంది. దీనివల్ల కాంతిని గుర్తించే కళ్ల భాగం దెబ్బతింటుంది. ఆ తర్వాత ఆస్టిక్ నాడీ ద్వారా మెదడుకు పంపే సంకేతాకు కూడా ఆటంకం కలుగుతుంది.
ఎవరికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది?
డయాబెటీస్ ఉన్నవారికే ఈ డయాబెటీస్ రెటినోపతి ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే గర్భవతులు, పొగాకు వాడే వారు, అధిక రక్తపోటు, శరీరంలో విపరీతంగా కొలెస్ట్రాల్ పేరుకుపోయిన వారికి కూడా ఈ ప్రమాదం ఎక్కువగా ఉంది.
అయితే డయాబెటీస్ రెటినోపతి వల్ల చూపు దెబ్బతింటుంది తప్ప.. పూర్తిగా అందత్వానికి మాత్రం కొన్ని క్లిష్ట సందర్భాల్లోనే దారితీస్తుంది. ఈ సమస్య వచ్చినప్పుడు సరైన సమయంలో చికిత్స తీసుకుంటే మీ కంటిచూపును కాపాడుకున్నవారవుతారు. కంటిచూపులో నల్లని మచ్చలు. ప్లోటర్లు, కళ్లు మసకబారడం వంటి ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించండి.