పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పెంచే నాభి చికిత్స... ఏలాగంటే...
నాభి చికిత్స ను పెచోటి పద్ధతి అని కూడా పిలుస్తారు, ఇది శరీరంలోని వివిధ అవయవాలను రోగాల భారిన పడకుండా ఉంచడం, విషపదార్థాలను వెలికితీయడం, వాటి పోషణ కోసం వాడే పురాతన ఆయుర్వేద విధానం.
నాభి చికిత్స ను పెచోటి పద్ధతి అని కూడా పిలుస్తారు, ఇది శరీరంలోని వివిధ అవయవాలను రోగాల భారిన పడకుండా ఉంచడం, విషపదార్థాలను వెలికితీయడం, వాటి పోషణ కోసం వాడే పురాతన ఆయుర్వేద విధానం.
నాభికి శరీరంలోనే కాదు ఆథ్యాత్మిక పరంగా కూడా అత్యంత ప్రాముఖ్యత ఉంది. కడుపుతో తల్లిపేగుతో సంబంధంగా ఏర్పడే బొడ్డుతాడుకు కేంద్రం అయిన ఈ నాభి 72,000 సిరలకు కేంద్ర బిందువు. ఇక్కడ నూనెతో మర్థనా చేయడం వల్ల ఈ నరాలను సున్నితంగా ప్రేరేపించవచ్చు.
నాభి కేంద్రాన్ని మణిపుర చక్రం అంటారు. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ ప్రాంతంలోని నూనెలను పీల్చుకోవడం ద్వారా చర్మం పునరుజ్జీవం చెందుతుంది. కణాలు పునరోత్తేజం చెందుతాయి. అయితే దీన్ని రాత్రి పూట నిద్రపోయే ముందు ఆచరించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
బొడ్డుమీద నూనెతో మర్థన చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలున్నాయో చూడండి..
జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. జఠరాగ్నిని ప్రేరేపించడం ద్వారా జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. వ్యర్థ పదార్ణాలను సమర్థవంతంగా తొలగిస్తుంది. పేగుల్లో సరైన క్రియలు జరిగేలా ప్రోత్సహించడం ద్వారా కడుపులో వచ్చే సమస్యల్ని తొలగిస్తుంది. శరీర మంటను తగ్గిస్తుంది.
జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరచడానికి ఉపయోగించాల్సిన నూనె... ఆవ నూనె లేదా అల్లం నూనె.
బొడ్డులో గోరువెచ్చటి నూనె వేయడాన్ని క్రమం తప్పకుండా చేయడం వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. స్పెర్మ్ చురుకుగా ఉండేలా చేస్తుంది. పునరుత్పత్తి వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు ఆడవారిలో సంతానోత్పత్తి పెరిగేలా చేస్తుంది. మహిళల్లో ఈ నాభి చికిత్స వల్ల రుతుక్రమంలోవచ్చే తిమ్మిరి, నొప్పిని తగ్గించవచ్చు. ఈ చికిత్స గర్భాశయ పొర చుట్టూ ఉన్న సిరలను సడలించేలా చేస్తుంది.
ఉపయోగించాల్సిన నూనెలు: కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె
కంటిచూపు మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. బొడ్డులోని నరాలకు కంటి నరాలకు లింక్ ఉంటుంది. అందుకే నాభి చికిత్సతతో కంటి సిరలను ఉత్తేజపరచడం వల్ల కంటిచూపును మెరుగు పరచవచ్చు. కళ్ల చుట్టూ ఉబ్బును తగ్గించడం, కలర్ బ్రైండ్ నెస్ ను తగ్గించడంలో సాయపడుతుంది. అంతేకాదు కళ్లు పొడిబారడం, మసకలు బారడం కూడా తగ్గుతుంది.
ఉపయోగించాల్సిన నూనెలు: బాదం నూనె లేదా ఆవ నూనె
కొన్ని రకాల నూనెలతో బొడ్డును మసాజ్ చేయడం వల్ల చర్మం కాంతులీనుతూ మెరిసి పోతుంది. పిగ్మెంటేషన్ తగ్గించడానికి, చర్మం పొడి బారకుండా ఉండాలంటే.. చర్మం నిగారింపు సంతరించుకోవాలంటే.. ఈ చికిత్స ఉపయోగపడుతుంది.
నాభిలో నూనె వేయడం వల్ల హార్మోన్ల సమస్యల వల్ల మొటిమలు రాకుండా రక్తాన్ని శుద్ధి చేసుకోవచ్చు. శరీరంమీదున్న మచ్చలు కూడా తొలగిపోతాయి.
ఉపయోగించాల్సిన నూనెలు: వేప నూనె, ఆలివ్ ఆయిల్, బాదం నూనె, ఆవ నూనె, టీ ట్రీ ఆయిల్, నిమ్మ ఎసెన్షియల్ ఆయిల్ లేదా రోజ్షిప్ ఆయిల్
కీళ్ల నొప్పులను తొలగిస్తుంది : కండరాల నొప్పి, సరిగా పడుకోకపోవడం వల్ల వచ్చే కండరాల నొప్పులు, కీళ్లనొప్పులనుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది .
ఉపయోగించాల్సిన నూనెలు: నువ్వుల నూనె, కాస్టర్ ఆయిల్ లేదా రోజ్మేరీ ఆయిల్