చెర్రీ ఫ్యాన్స్ కు కొత్త టెన్షన్,ఆ డైరక్టర్ కు ఓకే చెప్పేస్తాడా?
ఫ్యాన్స్ ఎప్పుడూ తమ హీరో సక్సెస్ ఫుల్ డైరక్టర్ తో సినిమా చేయాలని, భారీ బడ్జెట్ సినిమాతో దడదడలాడించాలని కోరుకుంటారు. అలాగే కలెక్షన్స్ తిరగరాసే కాన్సెప్టులతో డైరక్టర్స్ సినిమాలు తేయాలని రిక్వెస్ట్ చేస్తూంటారు. అందుకు వేదికగా సోషల్ మీడియాని ఎంచుకుని డిస్కషన్స్ జరుపుతూంటారు. ఏ డైరక్టర్ అయితే తమ హీరోకు సెట్ అవుతాడో, ఎవరు కారో అంచనా వేస్తూంటారు, హెచ్చరిస్తూంటారు. ఇప్పుడు రామ్ చరణ్ అభిమానుల్లో కొందరు తమ హీరో నెక్ట్స్ ఓకే చేయబోయే సినిమా గురించి టెన్షన్ పడుతున్నారు. ఎందుకలా అంటే ఆ దర్శకుడు ఓ పెద్ద డిజాస్టర్ ఇచ్చారు మరి. అలాంటి డైరక్టర్ తో సినిమా చేస్తే ఇంకేమైనా ఉందా..అనేది వారి డౌటానుమానం. ఇంతకీ ఎవరా డైరక్టర్ అంటే...
రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ ..తన తండ్రి తాజా చిత్రం ఆచార్య లో ఓ లెంగ్తీ రోల్ చేయబోతున్నాడు.
సోలోగా చేసేందుకు రకరకాల దర్శకుల నుంచి కథలు వింటున్నారు. కానీ ఏదీ ఇంకా ఫిక్స్ కాలేదు. మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లి సైతం వెయిటింగ్ లో ఉన్నాడు.
అయితే మరో ప్రక్క యువి క్రియేషన్స్ వారు రామ్ చరణ్ పై తమ బ్యానర్ లో సినిమా చేయమని ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. యువి క్రియేషన్స్ లో అయితే దర్శకుడు సుజీత్ తో చేయాలి.
ఈ మేరకు సుజీత్ ఓ స్క్రిప్టు రెడీ చేసి వెయిట్ చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానుల్లో కంగారు మొదలైందనే చెప్పాలి. ఎందుకంటే బాహుబలి వంటి సూపర్ హిట్ తర్వాత వెంటనే ప్రభాస్ కు సాహో వంటి డిజాస్టర్ ఇచ్చి వెనక్కి లాగాడు.
సాహో సినిమా మేకింగ్ కు భారీ బడ్జెట్ అయ్యింది. అలాగే స్క్రిప్టు సైడ్ నుంచి సమస్యలు ఉన్నాయని, అందుకే వర్కవుట్ కాలేదని వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలో తమ హీరోతో సుజీత్ చేయకుండా ఉండాలని ఓ వర్గం అభిమానులు కోరుకుంటున్నారు.
వంశీ పైడిపల్లి ఎలైగానా మెగా హీరో రామ్ చరణ్ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. వీరిద్దరూ ఇంతకముందు 'ఎవడు' సినిమా చేసిన సంగతి తెలిసిందే. దాంతో రామ్ చరణ్ తనవైపు మ్రొగ్గుతాడని భావిస్తున్నాడు. అయితే రామ్ చరణ్ వంశీ పైడిపల్లికి అవకాశం ఇస్తాడా,లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు.
రామ్ చరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నారు. రీసెంట్ గా రౌధ్రం రణం రుథిరం అన్న టైటిల్ ని కన్ఫర్మ్ చేస్తూ ఎన్.టి.ఆర్ రామ్ చరణ్ ల తో ఈ సినిమా లుక్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాలోని చరణ్ ఫస్ట్ లుక్ టీజర్ను పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
ఎన్.టి.ఆర్ వాయిస్ ఓవర్ తో రిలీజైన ఈ టీజర్ తో సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో రాజమౌళి చిన్న సాంపిల్ చూపించారు. అంతేకాదు పాన్ ఇండియా సినిమా అన్న అంచనాలని భారీగా పెంచేశారు. దాంతో ఆ సినిమా తర్వాత రిలీజయ్యే సినిమాలు...ఏ మాత్రం తగ్గకుండా ఉండాలి. అందుకు తగ్గ కథ, డైరక్టర్ ఉండాల్సిందే అని చరణ్ ఆలోచన.
రామ్ చరణ్ విషయంలో రాజమౌళి, కొరటాల కూడా చర్చలు మీద చర్చలు జరుపుతున్నారట. ఆచార్య సినిమాలో చరణ్ పాత్ర చాలా కీలకంగా కాబట్టి అందుకే ఆయన పాత్రను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కొరటాల రాజమౌళిని రిక్వెస్ట్ చేస్తున్నారట.
ఏదైమైనా అభిమానులు ఓ విషయం గుర్తు పెట్టుకోవాలి. స్టార్ డైరక్టర్స్ కూడా తమ కెరీర్ లో కొన్ని ప్లాఫ్ లు ఇచ్చారు. మళ్లీ కోలుకుని పెద్ద హిట్స్ ఇఛ్చారు. కాబట్టి సుజీత్ నుంచి ప్రతీ సారి సాహో లే రావు. రన్ రాజా రన్ మ్యాజిక్ మళ్లీ జరగొచ్చు.