MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Anchor Pradeep: మల్లెమాల నుండి మరో జెమ్ అవుట్... యాంకర్ ప్రదీప్ గుడ్ బై!

Anchor Pradeep: మల్లెమాల నుండి మరో జెమ్ అవుట్... యాంకర్ ప్రదీప్ గుడ్ బై!

అమ్మోరు, అరుంధతి వంటి బ్లాక్ బస్టర్స్ తెరకెక్కించిన మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్... అంజి మూవీ అనుభవం కారణంగా బుల్లితెర వైపు మళ్లారు. తక్కువ బడ్జెట్ తో సీరియల్స్, రియాలిటీ షోస్ నిర్మాణంలోకి దిగారు. మల్లెమాల నిర్మాణంలో వచ్చిన క్యాష్, ఢీ, జబర్దస్త్ సంచలనాలు నమోదు చేశాయి. సుదీర్ఘ కాలం టాప్ రేటింగ్ సాధించిన షోలుగా నిలిచాయి.

2 Min read
Sambi Reddy
Published : Jun 19 2022, 07:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Anchor Pradeep

Anchor Pradeep


వీటి సక్సెస్ వెనుక యాంకర్స్,కమెడియన్స్ పాత్ర చాలా ఉంది. మల్లెమాలకు భారీ లాభాలు కురిపించిన ఈ షోలు ఏడాది కాలంగా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఆ షోస్ లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న యాంకర్స్, కమెడియన్స్ నిష్క్రమించడమే దీనికి కారణం. ముఖ్యంగా ఢీ, జబర్దస్త్ షోస్ పూర్తిగా కళ కోల్పోయాయి. 
 

26


జబర్దస్త్ నుండి హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ , గెటప్ శ్రీను వెళ్లిపోయారు. అలాగే ఢీ రియాలిటీ షోలో యాంకర్ రష్మీ,సుధీర్, దీపికా పిల్లి ప్రస్తుతం లేరు. వీరి నేతృత్వంలో ఢీ 13 భారీ సక్సెస్ సాధించింది. ఢీ 14 నుండి జడ్జి పూర్ణ, రష్మీ, సుధీర్, దీపికా పిల్లిని తొలగించారు. వాళ్ళ నిష్క్రమణతో షోలో గ్లామర్ యాంగిల్ తో పాటు ఎంటర్టైన్మెంట్ తగ్గింది. 

36

సుడిగాలి సుధీర్ అయితే పూర్తిగా మల్లెమాలకు దూరం అయ్యాడు. ఢీ, జబర్దస్త్ వదిలేసినప్పటికీ శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకర్ గా కొన్నాళ్లు కొనసాగాడు. ప్రస్తుతం ఆ షో నుండి కూడా సుధీర్ వెళ్ళిపోయాడు. 
 

46

ఇది చాలదన్నట్లు ఢీ కి యాంకర్ ప్రదీప్ గుడ్ బై చెప్పనున్నాడట. ఢీ 14తో ప్రదీప్ అగ్రిమెంట్ ముగియనుండగా... ఢీ 15లో అతడు కనిపించడట. ఢీ షోకి సుధీర్, హైపర్ ఆది రాక ముందు నుండి ప్రదీప్ సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నాడు. ఇక ప్రదీప్ కూడా దూరమైతే ఆ షో టీఆర్పీ మరింత దిగజారడం ఖాయం.

56

ఏళ్ల తరబడి మల్లెమాలతో జర్నీ చేసిన ఈ కమెడియన్స్, యాంకర్స్ ఒక్కసారిగా ఇలా ఎందుకు వెళ్ళిపోతున్నారో అర్థం కావడం లేదు. 2019లో జబర్దస్త్ ను వీడిన నాగబాబు సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. మల్లెమాల వాళ్ళు రెమ్యూనరేషన్ తక్కువగా ఇస్తారని, కనీసం భోజన సదుపాయాలు కల్పించరని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

66

నాగబాబు ఆరోపణల తర్వాత కొంత మంది మినహాయిస్తే ఎవరూ మల్లెమాలను వీడలేదు. ఏడాది కాలంలోనే అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. కారణాలు ఏమైనా కానీ ప్రేక్షకులు తాము కోరుకున్న ఎంటర్టైన్మెంట్ కోల్పోతున్నారు. ప్రదీప్ ఢీ షోని వీడితే టీఆర్పీ పరంగా చాలా కష్టం.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved