నడి రోడ్డు మీద లైంగికంగా వేధించారు.. హీరోయిన్ రెజీనా ఆవేదన
తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలోనూ సూపర్ హిట్ సినిమాల్లో నటించిన అందాల భామ రెజీనా. ఎక్కువగా పర్ఫామెన్స్ ఓరియంటెడ్ సినిమాల్లో మాత్రమే నటిస్తున్న ఈ బ్యూటీ తాజాగా తను ఎదుర్కొన్న లైంగిక వేదింపుల సంఘటనలన వివరించింది.
టాలీవుడ్ హీరోయిన్ రెజీనా సంచలన విషయాలను వెల్లడించింది. తాను చాలా సార్లు లైగింక వేదింపులకు గురయ్యా అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది ఈ బ్యూటీ.
ఇండియా గ్లిట్జ్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించింది రెజీనా. తాను చాలా సార్లు లైంగిక వేదింపులకు గురయ్యానని, తనను శారీరకంగా లొంగ దీసుకునేందుకు పలువురు ప్రయత్నించినట్టుగా కూడా ఆమె వెల్లడించింది. అంతేకాదు తనను వేదించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని జనంలో చితక్కొట్టానని చెప్పింది.
మిస్టర్ చంద్రమౌళి సినిమా ప్రమోషన్ సందర్భంగా రెజీన ఈ విషయాలను వెల్లడించింది.. ఈ సందర్భంగా తన జీవితంలో జరిగిన కొన్ని బాధకర సంఘటనలను వెల్లడించింది.
తన కాలేజ్ డేస్లో చెన్నైలోని ఓ పాపురల్ థియేటర్ దగ్గర కొంత మంది అబ్బాయిలను తనను వేదించిన సంఘటనను వివరించింది రెజీనా. చెన్నైలోని ఇగా థియేటర్ బ్రిడ్జ్ దగ్గర కొంత మంది అబ్బాయిలు తనతో పాటు తన నలుగురు ఫ్రెండ్స్ను వేదింపులకు గురి చేశారని చెప్పింది. అంతేకాదు నడిరోడ్డు మీద ఓ వ్యక్తి తన పెదవులను తాకేందుకు ప్రయత్నించటం తనను ఎంతోగానో బాధపెట్టిందని చెప్పింది రెజీనా.
గతంలో తాను చాలా వీక్గా సున్నింతంగా ఉండేదాన్ని అని చెప్పిన రెజీనా.. ప్రస్తుతం తాను టఫ్గా తయారయ్యానని ఎలాంటి బాధలనైన భరించేంత దృడంగా తయారయ్యానని చెప్పింది.