మా మధ్య బాహుబలి-దేవసేన బంధాన్ని ఊహించుకోవద్దు...అదంతా సినిమా వరకే- అనుష్క
టాలీవుడ్ లో ప్రభాస్-అనుష్క ప్రేమ, పెళ్లి అనేవి ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్స్ . అత్యధికంగా నాలుగు సార్లు కలిసి నటించిన ఈ జంటపై కొంత కాలంగా పుకార్లు వస్తూనే ఉన్నాయి.
అనేక మార్లు అనుష్క మరియు ప్రభాస్ ఈ వార్తలను ఖండించడం జరిగింది. గత ఏడాది సాహో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ అన్ని ప్రధాన పరిశ్రమలను సందర్శించారు. వెళ్లిన ప్రతి చోటా ప్రభాస్ కి ఎదురైన కామన్ క్వశ్చన్...అనుష్కతో పెళ్లి గురించే.
ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు సైతం అనుష్కతో ప్రభాస్ పెళ్లి వార్తలను ఖండించడం జరిగింది. అలాగే ప్రభాస్ కోసం విశాఖపట్నం కి చెందిన ఓ అమ్మాయిని అనుకుంటున్నట్లు కూడా వెల్లడించాడు. కానీ ఇంత వరకు దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.
అనుష్క తల్లి ప్రపుల్ల శెట్టి కూడా ఈ వార్తలపై స్పందించారు. వాళ్ళు ఇద్దరు కో స్టార్స్ అలాగే మంచి మితృలు. అంతకు మించి వారి మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. నేను ప్రభాస్ లాంటి మిస్టర్ పర్ఫెక్ట్ అనుష్కకు భర్తగా రావాలని కోరుకుంటున్నా అన్నారు.
ఇక ప్రభాస్ తో పెళ్లి గురించి అనుష్కను అడుగగా ఆమె...''బాహుబలి-దేవసేన బంధాన్ని ఆఫ్ స్క్రీన్ లో కూడా మా మధ్య ఊహించుకోవద్దు. అది కేవలం సినిమా వరకు మాత్రమే పరిమితం'' అన్నారు.
బిల్లా సినిమా కోసం మొదటిసారి కలిసి నటించిన ప్రభాస్-అనుష్క ఆ తరువాత మిర్చి సినిమాలో జతకట్టారు. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సిరీస్ లో వీరిద్దరూ నటించిన సంగతి తెలిసిందే. ఈ నాలుగు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయం నమోదు చేశాయి.