అనిషా రెడ్డి విశాల్ కి హ్యాండిచ్చిందా.. పెళ్లి ఆగిపోయింది అంటున్నారుగా?
హీరో విశాల్ గత ఏడాది అనిషా రెడ్డితో నిశ్చితార్ధం చేసుకున్నారు. కోలీవుడ్ ప్రముఖులు కుడా హాజరైన ఈ వేడుక హైదరాబాద్ లో ఓ హోటల్ లో ఘనంగా జరిగింది. ఐతే ఈ పెళ్లి ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
అనిషా రెడ్డి పేరెంట్స్ మరొకరితో ఆమె పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నట్లు వార్తలు అందుతున్నాయి. అనిషా రెడ్డిని మరొకరికి ఇచ్చి పెళ్లి చేయాలని పేరెంట్స్ డిసైడ్ అయ్యారని పుకార్లు లేచాయి.
ఈ జంటకు నిశితార్థం జరిగి చాలా కాలం అవుతుంది. అయినప్పటికీ పెళ్లిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. దీనితో వీరి పెళ్లి ఆగిపోయిందన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
విశాల్, అనిషా మధ్య మనస్పర్థలు, అభిప్రాయ బేధాలు తెలెత్తాయట. దీనితో అనిషా మ్యారేజ్ ఓ యువ పారిశ్రామిక వేత్తతతో జరిపించాలని అనుకుంటున్నారట.
కోలీవుడ్ మీడియాలో ఈ వార్త ప్రముఖంగా వినిపిస్తుంది. దీనిపై విశాల్ త్వరలో స్పష్టత ఇచ్చే అవకాశం కలదని అంటున్నారు.
ఐతే ఈ వార్తలను విశాల్ తండ్రి ఖండించినట్లు తెలుస్తుంది. దీనితో నిజంగా అసలు ఏమీ జరిగింది అనే విషయంపై స్పష్టత లేదు.
గతంలో విశాల్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ తో ఘాడమైన ప్రేమాయణం నడిపాడు. పెళ్లి కూడా చేసుకోనున్నారని వార్తలు రావడం జరిగింది. అనూహ్యంగా వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారు. అలాగే హీరోయిన్ లక్ష్మీ మీనన్ తో కూడా విశాల్ అఫైర్ నడిపినట్లు వార్తలు వచ్చాయి.