బ్రహ్మానందం-వేణుమాధవ్ గొడవపై ఓపెన్ అయిన వేణు కుటుంబ సభ్యులు, అసలు నిజం భయపెట్టారు...!
స్టార్ కమెడియన్ గా ఎంతో భవిష్యత్ ఉన్న వేణు మాధవ్ అనారోగ్యం కారణంగా తక్కువ వయసులోనే అకాల మరణం పొందారు. 2019 సెప్టెంబర్ 25న వేణు మాధవ్ తుదిశ్వాస విడిచారు. వేణు మాధవ్ మరణించి ఏడాది దాటిపోగా, ఆయన భార్యా పిల్లలు ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది.
వేణు మాధవ్ భార్య శ్రీవాణి, సావికర్ , ప్రభాకర్ లు వేణు మాధవ్ గురించి, పరిశ్రమలో పెద్దలతో ఉన్న ఆయన అనుబంధం గురించి తెలియజేశారు. ముఖ్యంగా బ్రహ్మానందంతో వేణు మాధవ్ గొడవ పడ్డారని, వారిద్దరి మధ్య విబేధాలు ఉన్నాయని ప్రచారం జరిగింది.(Pic Credit: Telugu World)
ఈ విషయంపై శ్రీవాణి మాట్లాడుతూ నిజానికి బ్రహ్మనందం గారికి వేణుకు మధ్య ఎటువంటి విభేదాలు లేవు. అప్పుడప్పుడు సరదాగా ఇద్దరూ తిట్టుకొనే వారు.
దాని అర్థం వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని కాదు అన్నారు. వేణు మాధవ్ కి బ్రహ్మానందం మంచి మిత్రుడు అని వాళ్ళు తెలియజేశారు.
వేణు మాధవ్ తీరిక లేకుండా షూటింగ్స్ లో పాల్గొనేవాడట. తమ నివాసం మౌలాలీ నుండి బంజారాహిల్స్ కి వెళ్లే సమయంలో కారులోనే మేకప్ కావడం, డైలాగ్స్ ప్రిపేర్ అయ్యేవారట. తమ కోసం కష్టపడి సంపాదించి , కూడబెట్టారని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఇక వేణు మాధవ్ తన పొలం నుండి పవన్ కళ్యాణ్ కి బియ్యం పంపితే, పవన్ తోట నుండి మామిడి కాయలు పంపేవారట. ఒకరిపై మరొకరికి ఉన్న ఇష్టం వలన ఈ సంప్రదాయం కొనసాగుతూ ఉండేదట.
నాగబాబు సైతం ప్రతి రోజూ ఫోన్ చేసి వేణు ఆరోగ్యం గురించి అడిగేవారట.