స్లిమ్గా మారి ఆరేంజ్ శారీలో హోయలు పోతున్న రవితేజ బ్యూటీ వరలక్ష్మీ శరత్ కుమార్
పవర్ ఫుల్ లేడీ విలన్ పాత్రలకు కేరాఫ్గా నిలుస్తున్న వరలక్ష్మీ శరత్ కుమార్ ఇటీవల స్లిమ్గా మారారు. ఊహించిన విధంగా బరువు తగ్గి అభిమానులకు షాక్ ఇచ్చింది. తాజాగా శారీలో ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుని తన ఆనందాన్ని చాటుకోగా, వాటిని చూసి నెటిజన్లు స్లిమ్ బ్యూటీ వరా అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు.
ఇటీవల గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలు కొత్త ఫోటోలను ఇన్స్టాలో షేర్ చేసింది వరలక్ష్మి. ఆరేంజ్ కలర్ సిల్క్ శారీలో మెరిసిపోతుంది.
ఈ సందర్భంగా అభిమానులకు, ఫాలోవర్స్ కి నెటిజన్లకి శుభాకాంక్షలు తెలిపింది.
ఇటీవల `క్రాక్` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ముందుకొచ్చింది వరలక్ష్మి. ఇందులో `జయమ్మ`గా నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో అదరగొట్టేసింది. దీంతో ఇప్పుడు అందరి చేత `జయమ్మ`గా పిలుచుకుంటోంది.
ప్రస్తుతం `జయమ్మ` అనే యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుందంటే అతిశయోక్తి కాదు. అంతగా ఆ పాత్రకి ప్రాణం పోసింది వరలక్ష్మి.
అగ్ర నటుడు శరత్ కుమార్ తనయగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన వరలక్ష్మి మొదట్లో చాలా బొద్దుగా, లావుగా ఉండేది. క్రమంగా తగ్గుతూ వస్తోంది.
ఇప్పుడు అభిమానులు షాక్ అయ్యేలా చాలా స్లిమ్గా మారిపోయింది. సన్నజాజి పువ్వులా మారనప్పటికీ కాస్త స్లిమ్గా అయినా సో సెక్సీ గా ఉంది వరలక్ష్మి.
గ్లామర్ పాత్రలకు దూరంగా ఉండే వరలక్ష్మి చీరకట్టులో, నిండైన ట్రెండీ వేర్లో కనిపిస్తూ వాహ్ అనిపించుకుంది. తన అభిమానులు మంచి గౌరవాన్ని పొందింది.
`పోడ పొడి` చిత్రంతో నటిగా తమిళ చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ రెబల్ స్టార్ `మానిక్య` అనే చిత్రంత కన్నడలోకి ఎంట్రీ ఇచ్చింది. మమ్ముట్టి `కసబ`తో మలయాళంలోకి అడుగుపెట్టింది.
`విక్రమ్ వేదా`, `తారై తప్పట్టై`, `మాస్టర్ పీస్`, `పందెంకోడి 2`, `సర్కార్`, `మారి 2` చిత్రాలతో విజయాలను అందుకుంది. రెండేళ్ల క్రితం `తెనాలి రామకృష్ణ బి.ఏ బిఎల్` చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది.
ఇటీవల `క్రాక్` చిత్రంతో తెలుగులో సూపర్ హిట్ అందుకుని టాలీవుడ్ ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. ప్రస్తుతం తెలుగులో `నాంది` చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీంతోపాటు తమిళంలో ఆరు, కన్నడలో ఓ సినిమాలో నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతుందీ బ్యూటీ.
రీల్పైనే కాదు, రియల్ లైఫ్లోనూ రెబల్గా పేరున్న వరలక్ష్మి విలన్ పాత్రలకు బాగా సెట్ అవుతున్నారు. అదే సమయంలో ఆ మధ్య విశాల్తో ప్రేమాయణం సాగించిన ఈ అమ్మడు ఇప్పుడు టీమిండియా క్రికెట్తో సంబంధాలున్న ఓ వ్యాపారవేత్తతో డేట్చేస్తుందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై వరలక్ష్మి క్లారిటీ కూడా ఇచ్చింది. అలాంటివేమీ లేవని చెప్పింది.