సక్సెస్ కోసం పక్కింటి పుల్లకూర.. రుచి మరిగిన హీరోలు!
టాలీవుడ్ లో ప్రస్తుతం రీమేక్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. పక్కింటి పుల్లకూర ఎప్పుడు రుచికరమే అనే తరహాలో సక్సెస్ లు కొట్టాలని మన హీరోలు పరా బాషా కథకు బాగా రుచిమరిగారు. త్వరలో రానున్న ఆ కథలపై ఒక లుక్కేస్తే..
తమిళ్ లో ధనుష్ చేసిన అసురన్ సినిమాని తెలుగులో వెంకటేష్ నారప్ప గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు.
తమిళ్ లో అరుణ్ విజయ్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ తడం సినిమాని రామ్ 'రెడ్' గా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నాడు. ఆ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ తో రాబోతున్న విషయం తెలిసిందే. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించగా తమిళ్ లో అజిత్ నటించారు. కాన్సెప్ట్ హిట్టవ్వడంతో తెలుగులో కూడా వర్కౌట్ అవుతుందని ట్రై చేస్తున్నారు.
బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా - టబు నటించిన అందదున్ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దీంతో అదే కథను నితిన్ రీమేక్ చేసేందుకు ట్రై చేస్తున్నాడు.
మలయాళంలో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ సినిమా 100కోట్ల కలెక్షన్స్ తో రికార్డ్ సృష్టించింది. ఆ సినిమా రైట్స్ ని రామ్ చరణ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. కథలో మెయిన్ పాయింట్ చుట్టూ మరొక కథను క్రియేట్ చేసి మెగాస్టార్ తో కొత్త ప్రాజెక్టును రూపొందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రీసెంట్ గా కళ్యాణ్ రామ్ 'ఎంత మంచివాడవురా!' సినిమా కూడా భోజ్ పూరి సినిమాకు రీమేక్. అయితే అక్కడ సక్సెస్ అయినంతగా ఆ సినిమా తెలుగులో సక్సెస్ కాలేకపోయింది.
వరుణ్ తేజ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన జిగర్తాండ తెలుగులో వరుణ్ తేజ్ 'గద్దల కొండ గణేష్' గా రీమేక్ చేశాడు. అయితే తమిళ్ లో సక్సెస్ అయినంతగా ఆ సినిమా తెలుగులో కాలేదు.