మిల్కీ బ్యూటీ తమన్నా హృదయం పగిలి, కవిగా మారి..ఇంతకి ఎవరతను?
మిల్కీ బ్యూటీ తమన్నా హార్ట్ బ్రేక్ అయ్యిందట. తన హృదయం బద్దలవడంతో కవిగా మారిపోయిందట. దీంతో కవిత్వం కూడా రాసిందని చెప్పింది. మరి మిల్కీ బ్యూటీ హార్ట్ ఎప్పుడు బ్రేక్ అయ్యింది..? ఎలా బ్రేక్ అయ్యిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల `సామ్జామ్` టాక్ షోలో పాల్గొని ఈ విషయాలను పంచుకుంది.
సమంత హోస్ట్ గా `సామ్జామ్` అనే టాక్ షో రన్ అవుతుంది. ఓటీటీ ఫ్లాట్ఫామ్ `ఆహా` లో ఇది ప్రసారమవుతుంది.
ఇందులో ఇప్పటికే విజయ్ దేవరకొండ, నాగ్ అశ్విన్, రానా, బాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, కశ్యప్ పాల్గొన్నారు. తమ జీవితంలోని అనేక ఆసక్తికర అంశాలను పంచుకున్నారు.
ఇటీవల మిల్కీ బ్యూటీ తమన్నా కూడా పాల్గొన్నారు. ఆమెతో సమంత చేసిన ఛాటింగ్ ఎపిసోడ్ ప్రస్తుతం `ఆహా`లో రన్ అవుతుంది.
అయితే తమన్నా ఇందులో ఇప్పటి వరకు రివీల్ చేయని పలు ఆసక్తికరం అంశాలను పంచుకుంది.
తమన్నా కరోనాకి గురైన విషయం తెలిసిందే. ఆ సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితులను పంచుకుంది.
అనంతరం ఇన్స్టా లో తమన్నా తన గురించి తాను ఏ విధంగా అభివర్ణించుకున్నారో సమంత మాట్లాడారు. `తమన్నా.. కాఫీ ప్రియురాలు.. అప్పుడప్పుడు కవి, నటి అని ఉంది. మీరు కవితలు కూడా రాస్తారా? ఇప్పటి వరకు నాకు తెలియదు?` అని సామ్ ప్రశ్నించింది.
దీనికి తమన్నా స్పందిస్తూ, ఎప్పుడైతే మన హృదయం ముక్కలవుతుందో, అప్పుడు మనం కవిత్వాలు రాస్తామని నీక్కూడా తెలుసు. మన జీవితంలో అలాంటిది ఏదైనా జరిగినప్పుడు మనం కవిగా మారుతుంటామని తెలిపింది.
ఇంకా చెబుతూ, ఈ సమయంలో ఎదుటివారి హృదయాలను ముక్కలు చేసే మనుషులున్నారని పేర్కొంది. మొత్తంగా తన హార్ట్ బ్రేక్ అయ్యిందని పేర్కొంది.
అయితే తమన్నా తన హార్ట్ ని బ్రేక్ చేసిన వారెవరు అనేది పేర్కొనలేదు. దీంతో ఆమె అభిమానులు దాన్ని కనిపెట్టే పనిలో బిజీ అయ్యారు. మరి తమన్నా లవ్ ఫెయిల్యూర్ అయ్యిందా? లేక మరే విషయంలోనైనా హార్ట్ బ్రేక్ అయ్యిందా? అన్నది సస్పెన్స్ నెలకొంది.
దీనికి సామ్ రియాక్ట్ అవుతూ, తమన్నా హార్ట్ ని బ్రేక్ చేసే దైర్యం ఎవరికి ఉంది? ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టాలి` అని సరదాగా కామెంట్ చేసింది.
ఇప్పటి వరకు ఎలాంటి వివాదాలు లేకుండా క్లీన్ నేమ్తో రాణిస్తుంది తమన్నా. డేటింగ్, ఎఫైర్ లాంటి వార్తలేవి రాలేదు. మరి తమన్నా హృదయాన్ని పగలగొట్టిందెవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారడమే కాదు, ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.