అది నా కర్మ.. ట్రోలింగ్పై హీరోయిన్ ఆవేదన
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంలో బాలీవుడ్ లో సినీ వారసుల మీద విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇండస్ట్రీలో నెపోటిజం కారణంగానే సుశాంత్ లాంటి వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలియా భట్, సోనమ్ కపూర్ లాంటి వారి మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఈ విమర్శలపై హాట్ బ్యూటీ సోనమ్ కపూర్ స్పందించింది. అంతేకాదు తన సోషల్ మీడియా పేజ్లో కామెంట్స్ కనిపించకుండా డిసెబుల్ చేసింది ఈ బ్యూటీ. అంతేకాదు తన మీద కామెంట్స్ చేసినవారిపై చర్యలు తీసుకునేందుకు రెడీ అవుతోంది.
బాలీవుడ్ లో నిర్మాతలు నటుల కుటుంబం నుంచి వచ్చిన బ్యూటీ సోనమ్ కపూర్. ఈ భామ తనకు సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని కామెంట్స్ స్క్రీన్ షాట్స్ను షేర్ చేసింది. ఈ కామెంట్స్లో ఆమె తండ్రి అనిల్ కపూర్తో పాటు, చెల్లి రియా ఇతర కుటుంబ సభ్యులకు కూడా అవమానకరంగా దూషించారు. దీంతో ఆవేదన చెందిన సోనమ్ కామెంట్స్ను డిజెబుల్ చేసేసింది.
`ఇవి నాకు వచ్చిన కొన్ని కామెంట్స్. మీడియాతో పాటు ఇలాంటి భావాలను కామెంట్లను ప్రొత్సహించేవారికోసం. ప్రజలు ఒకరు కొందరికి మంచి అని మరికొందరికి చెడు అని మాట్లాడుతున్నారు. ఇది సరైంది కాదు` అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింద సోనమ్. అంతేకాదు తన పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతోంది సోనమ్.
అంతేకాదు నేను సినిమాల్లో నిలదొక్కుకునేందుకు ఎంతో కష్టపడిని వ్యక్తి కుటుంబం నుంచి వచ్చినందుకు గర్వ పడుతున్నా అంటూ చెప్పింది. ఫాదర్స్ డే సందర్భంగా మరికొన్ని వ్యాఖ్యలు చేసింది సోనమ్. అవును నేను నా తండ్రి కూతుర్ని. ఆయన కారణంగానే నేను ఇక్కడ ఉన్నాను. అది నాకు అవమానకరం కాదు. నేను ఈ స్థాయికి రావడానికి నా తండ్రి చాలా కష్టపడ్డాడు. నేను ఎక్కడ, ఎవరికి పుట్టడం అనేది నా కర్మ.
64 ఏళ్ల వయసులో నా తల్లి దండ్రులు ఇలాంటి భరించటం నాకు ఇస్టం లేదు. ఇలాంటి మాటలు పడేంత తప్పు వారు ఏం చేయలేదు. మీ మాటలకు భయపడి ఇలా చేయటం లేదు. కేవలం కామన్ సెన్స్ తో నా ఆరోగ్య పరిస్థితిని మా తల్లిదండ్రలు గౌరవాన్ని కాపాడేందుకే కామెంట్స్ను డిజేబుల్ చేస్తున్నాను` అంటూ కామెంట్ చేసింది సోనమ్.