అందరి ముందే నవదీప్కి కనెక్ట్ అయిన శ్రీముఖి.. బుంగమూతి కూడా పెట్టుకుంది!
బొద్దు అందాల భామ శ్రీముఖి కనెక్ట్ అవుతుంది. కొన్నాళ్లు రవితో కనెక్ట్ అయ్యింది. ఇప్పుడు నవదీప్తో కనెక్ట్ అవుతుంది. అది ఎవరో చెప్పడం కాదు స్వయంగా శ్రీముఖినే చెప్పింది. తాను నవదీప్కి ఇలా కనెక్ట్ అవుతున్నానేంటి? అని ఆశ్చర్యానికి గురవుతుంది. మరి ఈ సెక్సీ భామ కనెక్ట్ కి కారణం ఏంటి? ఎక్కడ కనెక్ట్ అయ్యిందనేది చూస్తే..
యాంకర్గా రాణిస్తున్న శ్రీముఖికి ఇటీవల షోస్ తగ్గిపోయాయి. కారణం ఈ అమ్మడిని జనాలు పట్టించుకోవడం లేదా? లేక ఈమె హోస్ట్ గా చేసిన షోస్ క్లిక్ కావడం లేదా? అన్నది సస్సెన్స్ గా మారింది.
ఇదంతా పక్కన పెడితే, ఏదైనా స్పెషల్ షోస్ చేయాలంటే మాత్రం శ్రీముఖి ఆప్షన్గా మారింది. ముఖ్యంగా జీ తెలుగులో ఆమె వరుసగా స్పెషల్ ఈవెంట్ చేస్తూ వస్తోంది. క్రిస్మస్ కానుకగా, న్యూ ఇయర్ కానుకగా చేసిన షోస్ ఆకట్టుకున్నాయి.
తాజాగా శ్రీముఖి హోస్ట్ గా జీ తెలుగులో `సంక్రాంతి సంబరాలు` స్పెషల్ ఈవెంట్ని ప్లాన్ చేశారు. ఇందులో మేల్ హోస్ట్ గా నవదీప్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు. ఇందులో శ్రీముఖి, నవదీప్ మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్గా ఉన్నాయి.
నవదీప్, శ్రీముఖి ఎంట్రీ ఇచ్చారు. ఎంట్రీ ఇవ్వడంతోనే శ్రీముఖి.. నవదీప్ని టచ్ చేసుకుంది. భుజాలతో ఇద్దరు హగ్ ఇచ్చుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. శ్రీముఖి ఈ సందర్భంగా చేసిన కామెంట్ వైరల్ అవుతుంది.
నవదీప్ని భుజాలతో డిచ్ ఇచ్చాక.. `నేనింటీ ఇలా కనెక్ట్ అయిపోతున్నాను` అని షాక్ ఇచ్చింది. దీనికి నవదీప్ స్పందిస్తూ, `అదే ఇంకా ఎవరవుతున్నారా? అని చూస్తున్నాను` అని చెప్పాడు.
దీనికి శ్రీముఖి స్పందిస్తూ, `నేను మీ మీద అలిగాను.. ` అంటే ఇప్పుడే కదా వచ్చింది. అప్పుడే అలగడమేంటి? అని నవదీప్ అనడం, `నేను బుంగమూతి కూడా పెట్టుకున్నాను` అని శ్రీముఖి అంటే.. బుంగమూతా? బొంగమూతా? ` అని నవదీప్ పంచ్ వేయడం నవ్వులు పూయించింది.
ఆ తర్వాత శ్రీముఖి `మీకు మరదలు ఎవరైనా ఉన్నారా` అని నవదీప్ని అడుగుతుంది. అందుకు ఆయన స్పందిస్తూ, `ఉన్నారు..ఇంకా ఎవరు మా మామయ్య కూతురు` అని పంచ్ వేయడం మరింతగా నవ్వించింది.
ఈ ప్రోమోలో మొత్తంగా శ్రీముఖి, నవదీప్ మధ్య జరిగే కెమిస్ట్రీ, ఫిజిక్స్ పైనే ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కడుపుబ్బ నవ్విస్తున్నాయి. ఈ సంక్రాంతి కానుకగా ఈ `సంక్రాంతి సంబరాలు` స్పెషల్ ఎపిసోడ్ ఈ నెల 13, 14 తేదీల్లో ప్రసారం కానుంది.
ఇదిలా ఉంటే శ్రీముఖ ఇందులో శారీలో మెరవగా, నవదీప్ కుర్తాలో కనిపించారు. వీరిద్దరి మధ్య సరదా కామెంట్లు, సెటైర్లు, రొమాన్స్, హగ్ లు జీ తెలుగు సభ్యులను బాగా ఎంటర్టైన్ చేసిందని, ఇది సంక్రాంతి కానుకగా ఆడియెన్స్ ని కూడా ఎంటర్టైన్ చేయడం ఖాయమంటున్నారు.
శ్రీముఖి మొన్నటి వరకు `బొమ్మ అదిరింది` షోకి హోస్ట్ గా చేసింది. ఇప్పుడు దాన్నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది. మరోవైపు `ఓ వుమానియా` అనే షోని స్వతహాగా చేస్తుంది.
ఇదిలా ఉంటే నిత్యం శ్రీముఖి తన హాట్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ వారిని ఎంటర్టైన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆమె సెక్సీ ఫోటోలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందంటే అతిశయోక్తి కాదు.