శ్రీదేవి, ఐశ్వర్య, దీపికా... బాలీవుడ్ కి కోడళ్ళుగా వెళ్లిన సౌత్ హీరోయిన్స్ వీరే!
సౌత్ ఇండియాలో పుట్టిన కొందరు స్టార్ హీరోయిన్స్ బాలీవుడ్ ని దున్నేశారు. జనరేషన్ కి ఒకరు చొప్పున మాకు తిరుగులేదని నిరూపించారు. హేమ మాలిని, శ్రీదేవి, ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొనె వంటి వారు బాలీవుడ్ పై తిరుగు లేని స్టార్స్ గా కొనసాగారు. ఈ ద్రవిడ బ్యూటీస్ కోడళ్ళుగా బాలీవుడ్ కి వెళ్లడం విశేషం. బాలీవుడ్ ప్రముఖులను చేసుకున్న మన స్టార్ హీరోయిన్స్ ఎవరో చూసేయండి.
దశాబ్దాల పాటు బాలీవుడ్ ని ఏలిన ఐశ్వర్య రాయ్ లాంటి అందగత్తె చేయి అందుకున్నాడు హీరో అభిషేక్ బచ్చన్. ఓ మూవీ షూటింగ్ సమయంలో ఐశ్వర్య ప్రేమలో పడిన అభిషేక్ 2007లో ఆమె చేయి అందుకొని మూడు ముళ్ళు వేశాడు. ఐశ్వర్య మంగుళూరుకి చెందిన బంట్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి. వీరది తుళు అధికారిక భాష.
అతిలోక సుందరి శ్రీదేవి సౌత్ ఇండియాలో పుట్టి బాలీవుడ్ ని మెట్టినిల్లు చేసుకుంది. 1996లో నిర్మాత బోనీ కపూర్ ని శ్రీదేవి వివాహం చేసుకున్నారు. బోనీ కపూర్ కి శ్రీదేవితో అది రెండవ పెళ్లి కావడం విశేషం.
ప్రస్తుతం బాలీవుడ్ టాప్ హీరోయిన్ ఎవరేంటే టక్కున దీపికా పదుకొనె పేరు చెబుతారు. బెంగుళూరుకి చెందిన ఈ కన్నడ బ్యూటీ రణ్వీర్ సింగ్ ని వివాహం ఆడారు. డెన్మార్క్ దేశంలో పుట్టి పెరిగిన దీపికా కొంకణి భాష మాట్లాడే కుటుంబానికి చెందిన అమ్మాయి. 2018లో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
80లలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయిన హేమ మాలిని కూడా సౌత్ ఇండియా భామనే. నటుడు ధర్మేంద్రను హేమ మాలిని 1980లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు సంతానంగా ఉన్నారు. హేమ మాలిని తమిళ అయ్యంగార్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి.
బాలీవుడ్ వెండితెరపై తమదైన మార్క్ క్రియేట్ చేసిన హీరోయిన్స్ లో విద్యాబాలన్ ఒకరు. తమిళనాడుకు చెందిన విద్యా బాలన్ సిద్దార్థ్ రాయ్ కపూర్ ని 2012లో వివాహం చేసుకున్నారు.
మంగుళూరుకి చెందిన శిల్పా శెట్టి సైతం బాలీవుడ్ లో హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించారు. ఈ యోగా బ్యూటీ 2009 పారిశ్రామిక వేత్త రాజ్ కుంద్రాను వివాహం చేసుకున్నారు.