ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, విజయ్ వీరే టాలీవుడ్..మిగిలిన హీరోలందరు పక్కకెళ్లి ఆడుకోండిః శ్రీరెడ్డి
చిరంజీవి, పవన్, బన్నీ, చరణ్, నాగార్జున, బాలకృష్ణ, రవితేజలపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వీరంతా పక్కకెట్టి ఆడుకోండి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ అంటే ప్రభాస్, మహేష్,ఎన్టీఆర్, విజయ్ దేవరకొండలే నట. తాజాగా శ్రీరెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
వివాదాస్పద నటి శ్రీరెడ్డి సమయం చిక్కినప్పుడల్లా స్టార్ హీరోలను టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ హాట్ టాపిక్గా మారుతుంది.
పెద్ద హీరోలను తిడుతూ పాపులర్ అవుతుంది శ్రీరెడ్డి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తుందీ భామ. చిరంజీవి పవన్లపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది.
తాజాగా మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ అంటే ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండలేనట. వీళ్లు నలుగురు టాలీవుడ్కి నాలుగు పిల్లర్లు అని చెప్పిందీ హాట్ బ్యూటీ.
మిగిలిన హీరోలను పక్కకెళ్లి ఆడుకోండి అని చెప్పింది. మీ ఆటలన్నీ ఇక్కడ సాగవు అనేలా చెప్పింది శ్రీరెడ్డి.
అంటే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్చరణ్, రవితేజ, గోపీచంద్.. ఇలా చెప్పుకుంటూ పోతే మిగిలిన హీరోలందరిపై ఆమె ఈ కామెంట్ చేసింది.
వాళ్లంతా ఏం చేసినా వేస్టే అనే మీనింగ్లో శ్రీరెడ్డి పోస్ట్ పెట్టింది. టాలీవుడ్ని ఈ నలుగురు హీరోలే నిలబెడుతున్నట్టుగా చెప్పింది శ్రీరెడ్డి.
దీంతో ఆయా హీరోల అభిమానులు స్ట్రాంగ్ కౌంటర్స్ ఇస్తున్నారు. శ్రీరెడ్డిపై తమదైన స్టయిల్లో విమర్శలు గుప్పిస్తూనే ఆమెపై వల్గర్ కామెంట్లు చేస్తున్నారు.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాగా హర్ట్ అయినట్టుంది. గతంలో శ్రీరెడ్డి బన్నీ అంటే ఇష్టమని చెప్పిన వీడియోని షేర్ చేస్తున్నారు. బన్నీ అంటే ఇష్టమని చెప్పు లేదంటే ఫ్యాన్స్ వార్కి దిగుతారు అని అంటున్నారు.
మరోవైపు తన సెక్సీ ఫోటోలను పంచుకుంటూ రోజూ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటుంది శ్రీరెడ్డి.