పూజా హెగ్డే.. డోస్ పెంచి అందాల విందు!
తెలుగు పరిశ్రమలో వరుస హిట్స్తో దూసుకపోతున్న స్టార్ అండ్ క్రేజీ హీరోయిన్ పూజా హెగ్డే. సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్గా ఉండే ఈ బట్టబొమ్మకు ఉండే ఫాలోయింగ్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లాక్డౌన్తో ఇంటికే పరిమితమైన ఈ నటి తరుచూ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తున్నారు. అంతేకాదు తన ఫొటోలను సైతం అప్ లోడ్ చేస్తోంది. .. ఈ ఏడాది తెలుగులో ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంతో భారీ విజయాన్ని అందకున్న పూజా ప్రస్తుతం ప్రభాస్, అఖిల్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆమె తాజాగా వైరల్ అవుతున్న కొన్ని ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.
హీరోయిన్ పూజా హెగ్డే ఫుల్ఫామ్లో ఉన్నారు. టాలీవుడ్లో ప్రభాస్తో ఓ సినిమా (ఓ మై డియర్), అఖిల్తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సినిమాలో పూజ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఈ బ్యూటీ మరో మంచి ఆఫర్ కొట్టేశారని సమాచారం. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించబోతున్న సినిమాలో హీరోయిన్గా నటించనున్నారట పూజా హెగ్డే. ఆల్రెడీ ఆన్లైన్ ద్వారా కథ కూడా విన్న పూజ హీరోయిన్గా నటించేందుకు ఓకే అన్నారట.
‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఫేమ్ హను రాఘవపూడి తెరకెక్కించనున్న సినిమాలోనే దుల్కర్, పూజ జంటగా నటించనున్నారని సమాచారం. స్వప్నా దత్, ప్రియాంకా దత్ ఈ సినిమాను నిర్మించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.
మరోవైపు బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించనున్న ‘కబీ ఈద్ కబీ దీవాలి’ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా కన్ఫార్మ్ అయిన సంగతి తెలిసిందే.
అక్షయ్ కుమార్ నటించనున్న ‘బచ్చన్ పాండే’ చిత్రంలోనూ పూజయే హీరోయిన్ అట. సో.. పూజ డైరీ ప్రస్తుతానికి ఫుల్ అన్నమాట. వచ్చే సంవత్సరం ఎక్కువ బాలీవుడ్ లోనే కనపడనుంది.
ప్రస్తుతం టాలీవుడ్లో వరుస సక్సెస్ సినిమాలతో జోష్ మీదున్న భామ పూజా హెగ్డే. అరవింద సమేత, మహర్షి , అల వైకుంఠపురములో ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్న ఈ భామ ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ డియర్ అనే చిత్రంలో నటిస్తోంది.
ఇక ఇదిలా ఉంటే ఇన్స్టాగ్రామ్లో సమంత అక్కినేని అందంపై పూజా హెగ్డే నెగెటివ్ కామెంట్ చేయటంతో సమంత ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. దీంతో ఆ మద్యన రెండు మూడు రోజులుగా హాట్ టాపిక్గా మారింది. ఈ పోస్ట్ పూజాకి లేని పోని చిక్కులని తెచ్చిపెట్టింది.
బాక్సాఫీస్ను కలకలలాడించే జిగేలు రాణి గా పేరు తెచ్చుకున్న అరవింద... మోడలింగ్ రంగం నుంచి వెండితెర మీద అడుగుపెట్టిన ఈ తరం శ్రీదేవి.. పూజా హెగ్డే
మోడలింగ్ రంగంలో సత్తా చాటిన పూజ తరువాత టెలివిజన్ కమర్షియల్స్తో దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో బిజీగా ఉన్నా.. ఈ భామ వెండితెరకు పరిచయం అయ్యింది మాత్రం తమిళ ఇండస్ట్రీ నుంచి.
2012లో రిలీజైన మూగముడి సినిమాతో తెరంగేట్రం చేసింది పూజా. ఆ తరువాత ఇంతవరకు కోలీవుడ్లో మరో సినిమా చేయలేదు.
నాగచైతన్య 'ఒక లైలా కోసం'తో పరిచయమైన పూజ ఆ తర్వాత వరుణ్ తేజ్ సరసన 'ముకుంద' సినిమాలో నటించి తెలుగు వారికి మరింతగా దగ్గరైంది.
తన తొలి సినిమాలు రెండూ డిజాస్టర్స్ అయినా..వరుసగా తెలుగులో ఆఫర్స్ అందిపుచ్చుకుంటూ ప్రస్తుతం తెలుగులో చాలా బీజీగా ఉన్న హీరోయిన్లో ఒకరుగా ఉంది.
స్టార్ హీరో హృతిక్ రోషన్ సరసన ఓ చారిత్రక కథలో రాణి పాత్రలో నటించింది పూజ. మొహెంజోదారో సినిమాతో బాలీవుడ్కు పరిచయం అయిన పూజకు అక్కడ కూడా చేదు అనుభవమే ఎదురైంది.
మొహెంజోదారో సినిమా కూడా ప్లాప్ కావటంతో ఆమె మీద ఐరన్లెగ్ ముద్ర వేశారు. కానీ ఆ సెంటిమెంట్ను బ్రేక్ చేసిన సినిమా `డీజే దువ్వాడ జగన్నాథ్`. అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాతో తొలి కమర్షియల్ సక్సెస్ అందుకుంది
ఈ భామ టాప్ హీరోల అందరితోను ఆడిపాడింది. ఆమెను హీరోలే తమ సినిమాల్లో రికమెండ్ చేసే స్దాయికి ఎదిగింది. నిర్మాతలు సైతం ఆమె అడిగినంత ఇచ్చి తమ సినిమాల్లోకి తీసుకుంటున్నారు.
అల్లు అర్జున్ సరసన 'డీజే' లోహాట్గా అదరగొట్టిన ఈ భామ.. ఎన్టీఆర్తో 'అరవింద సమేత'లో కుర్రాళ్ల మనస్సులను అలా అలవోకగా పట్టేసి, మైమరిపించింది.
తర్వాత మహేష్ బాబుతో కలసి ‘మహర్షి’లో చేసి మంచి హిట్ అందుకోవటం ప్లస్ అయ్యింది. దాంతో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. సోషల్ మీడియాలోనూ ఆమె తన హవా చూపిస్తోంది.
గతేడాది విడుదలైన హౌస్ఫుల్ 4 సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కింది. తాజాగా ఇంట్లో యోగా చేస్తున్న స్టిల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రీసెంట్ గా బన్ని సరసన అలవైకంఠపురములో నటించి బుట్ట బొమ్మ అనిపించుకుంది. త్రివిక్రమ్ ఆమెకు రాసిన డైలాగులకు జనం ఫిదా అయ్యిపోయారు.
వరుస హిట్లతో ఊపు మీద ఉన్న ఈ ముద్దుగుమ్మ మరో అవకాశాన్ని అందుకుంది. తమిళ్లో అదిరిపోయే ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది.