పార్టీలు చేసుకుంటున్న సింగర్ సునీత అండ్ రామ్... కుర్రాళ్లను మించిపోయారుగా!
సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించి ఆమె ఫ్యాన్స్ ని షాక్ చేశారు. పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లలు ఉన్న సునీత, 42 ఏళ్ల వయసులో పెళ్ళికి సిద్ధం కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య సింగర్ సుజాత నిశ్చితార్ధం జరిగింది. ఓ మీడియా సంస్థ యజమాని అయిన రామ్ వీరపనేనితో ఆమె నిశ్చితార్ధం జరిగింది.
పిల్లలు మరియు తన భవిష్యత్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సునీత సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తన రెండో పెళ్లి నిర్ణయాన్ని సమర్ధించి, సహకరిచాలని ఆమె ఫ్యాన్స్ కి విజ్ఞప్తి చేశారు.
ఇక డిసెంబర్ నెలలోనే సునీత- రామ్ ల వివాహం జరగాల్సి ఉంది. ఈనెల 27వ తేదీన పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. కారణం ఏదైనా ఈ వేడుకను వాయిదా వేశారు సునీత.
కాగా గ్రాండ్ గా ప్రీవెడ్డింగ్ పార్టీ ఇచ్చారు ఈ జంట. హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ఈ వేడుక జరిగింది. ఈ పార్టీలో సుజాత, రామ్ ట్రెండీగా దుస్తులలో మెరిసిపోయారు.
ఈ ప్రీ వెడ్డింగ్ పార్టీకి హీరో నితిన్ తో పాటు, రేణూ దేశాయ్, సుమ కనకాల హాజరైనట్లు సమాచారం.ఈ పార్టీలో కేక్ కట్ చేసిన రామ్, సునీత కొత్త జంట వలే సందడి చేశారు.
మొదటి భర్త కిరణ్ కుమార్ గోపరాజుతో విడాకులు తీసుకొని విడిపోయిన సునీత, చాలా కాలంగా ఒంటిగా ఉంటున్నారు.