మాది విడాకులు కాదు బ్రేకప్ అంటోన్న శ్వేత బసుప్రసాద్..అక్కడ దున్నేస్తుందిగా!
శ్వేత బసు ప్రసాద్ గతంలో వివాదాలకు కేరాఫ్గా నిలిచారు. ఓ వైపు సెక్స్ రాకెట్లో ఇరుక్కోవడం, మరోవైపు లవ్, విడాకుల వంటి విషయాల్లో వివాదాలు వెంటాడాయి. అయితే తమది విడాకులు కావని, అదో బ్రేకప్ లాంటిదని చెబుతోంది శ్వేత. ఈ `కొత్తబంగారులోకం` బ్యూటీ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో హీటు పెంచుతోంది.
తెలుగులో `కొత్తబంగారులోకం` చిత్రంతో ఓవర్నైట్లో పాపులర్ అయ్యింది శ్వేతబసు ప్రసాద్. అంతకు ముందు బాలనటిగా హిందీలో `మాక్డే` చిత్రానికిగానూ బాలనటిగా జాతీయ అవార్డు అందుకుంది.
తెలుగులో `కాస్కో`, `రైడ్` చిత్రాలతో ఆకట్టుకున్నా. ఆ తర్వాత ఈ అమ్మడికి సరైన సినిమాలు పడలేదు. సక్సెస్ పడలేదు. తెలుగు, హిందీ సినిమాల్లో నటించినా ప్రయోజనం లేదు. కెరీర్ పరంగా ఒడిదుడుకులను ఎదుర్కొంది.
ఈ క్రమంలోనే ఆమెని సెక్స్ రాకెట్ వెంటాడింది. దీని వల్ల అనేక ఇబ్బందులు పడింది. తనని కావాలని ఇరికించారని ఆరోపించింది. అయినా ఈ అమ్మడికి సినిమా అవకాశాలు రాలేదు. దీంతో చాలా రోజులు ఇబ్బంది పడ్డింది.
ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్ని ప్రేమించి 2018 డిసెంబర్ 13న పెళ్లి చేసుకుంది. మ్యారేజ్ విషయంలో కూడా శ్వేతకి ఇబ్బందులు తప్పలేదు. ఫ్యామిలీ లైఫ్ సెట్ కాలేదు. పెళ్లి చేసుకున్న ఏడాదిలోపే విడాకులు తీసుకున్నారు. ఆ సమయంలో ఓ నోట్ని కూడా ఇన్స్టాలో పోస్ట్ చేసింది శ్వేత.
తాజాగా దీనిపై మరోసారి స్పందించిన శ్వేత. తామిద్దరం పరస్పరం అంగీకారంతోనే విడిపోయామని, అది విడాకులు కాదు, ఓ బ్రేకప్ అని చెప్పింది. ఇప్పుడు తాను మారిపోయానని పేర్కొంది.
ఆమె చెబుతూ, `మ్యారేజ్ జరిగిన పదేళ్ల తర్వాత కూడా కొందరు భార్యాభర్తలు విడిపోతున్నారు. కానీ మేమిద్దరం ఏడాదిలోపే మా బంధాన్ని ముగింపు పలకాలనుకున్నాం. కాబట్టి దీన్ని విడాకులు అనే పెద్ద పదంతో పోల్చడం కంటే.. బ్రేకప్ అనడం కరెక్ట్ అనిపిస్తుంది.
విడాకుల సమయంలో నాకు నా కుటుంబం, స్నేహితులు అండగా నిలిచారు. ఇప్పుడు నాకు నేనే ఓ మంచి స్నేహితురాలిగా మారిపోయాను. అంతా సెట్ అయ్యింది` అని పేర్కొంది శ్వేత.
ఇటీవల సంక్రాంతి సమయంలో తన 30వ పుట్టిన రోజుని జరుపుకుంది. ఇందులో మధూర్ బండార్కర్, నవాజుద్దీన్ సిద్ధిఖీ వంటి సెలబ్రిటీలు హాజరు కావడం విశేషం.
అంతేకాదు బాలీవుడ్ బిగ్ షాట్స్ తో అనుబంధాన్ని కొనసాగిస్తుంది శ్వేత.
తన బర్త్ డే ఫోటోలు ఆ మధ్య తెగ వైరల్ అయ్యాయి.
తన బర్త్ డే ఫోటోలు ఆ మధ్య తెగ వైరల్ అయ్యాయి.
తన బర్త్ డే ఫోటోలు ఆ మధ్య తెగ వైరల్ అయ్యాయి.
తన బర్త్ డే ఫోటోలు ఆ మధ్య తెగ వైరల్ అయ్యాయి.
తన బర్త్ డే ఫోటోలు ఆ మధ్య తెగ వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం శ్వేత బసు ప్రసాద్ హిందీలో హీరోయిన్గా రాణిస్తుంది. మంచి ప్రాజెక్ట్ లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది.
`బద్రినాథ్ కి దుల్హానియా`లో కీలక పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత `ది తస్కెంట్ ఫైల్స్` చిత్రంలో అలరించింది.
గతేడాది `శుక్రాను`, `సీరియస్ మేన్`, `కామెడీ కపుల్` వంటి వెబ్ మూవీస్లో మెప్పించింది. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓ రకంగా పూర్వవైభవాన్ని తెచ్చుకుంటోందీ భామ.
ఇప్పుడు `జమున్`, `ఇండియా లాక్డౌన్` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఇప్పుడిప్పుడు కెరీర్పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిందని చెప్పొచ్చు.