గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్న మున్నాభాయ్ సంజయ్ దత్(ఫోటోస్)
మున్నాభాయ్ సంజయ్ దత్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ ఛాలెంజ్లో భాగంగా సంజూభాయ్ మొక్కలు నాటారు. ప్రస్తుతం ఆయన `కేజీఎఫ్ః ఛాప్టర్2` షూటింగ్ హైదరాబాద్లో జరుగుతుంది. ఇందులో సంజయ్దత్ పాల్గొంటున్నాడు. తన బర్త్ డేని పురస్కరించుకుని సంతోష్ కుమార్.. సంజయ్ని కలిసి మొక్కలు నటించారు.
`కేజీఎఫ్ః ఛాప్టర్ 2`లో మెయిన్ విలన్ అధీర పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆర్ఎఫ్సీలో జరుగుతుంది.
యష్, సంజయ్ దత్ వంటి ప్రధాన తారాగణం నటిస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల సంజయ్ దత్ క్యాన్సర్కి గురైన విషయం తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఆయన కోలుకుంటున్నారు.
తన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఆయన షూటింగ్లో పాల్గొనడం విశేషం.
మొక్కలు నాటిన అనంతరం సంజూ భాయ్తో కలిసి సెల్ఫీ తీసుకుంటున్న ఎంపీ సంతోష్ కుమార్
మొక్కలు నాటిన అనంతరం సంజూ భాయ్తో కలిసి సెల్ఫీ తీసుకుంటున్న ఎంపీ సంతోష్ కుమార్
ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.