డ్రగ్స్ కేసు: సారీ, రకుల్! అంటూ...మద్దతు తెలిపిన సమంత..!
కొద్దిరోజులుగా డ్రగ్స్ కేసు బాలీవుడ్ ని షేక్ చేస్తుంది. డ్రగ్స్ ఆరోపణల కేసులో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి విచారణలో రకుల్ ప్రీత్, సారా అలీ ఖాన్ పేర్లు బయటపెట్టారన్న వార్తలు సంచలం రేపాయి. కాగా ఈ విషయంలో రకుల్ కి మద్దతుగా నిలిచిన సమంత, ఆమెకు క్షమాపణలు చెప్పారు.
డ్రగ్స్ ఆరోపణలతో అరెస్ట్ అయిన రియా చక్రవర్తి 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఎన్సీబీ అధికారులు రియాను విచారిస్తున్నారు. అరెస్ట్ అయిన వెంటనే రియా చక్రవర్తి బెయిల్ కోసం అప్లై చేయగా, జడ్జ్ ఆమె పిటీషన్ కొట్టివేశారు.
కాగా విచారణలో రియా చక్రవర్తి బాలీవుడ్ కి చెందిన 25మంది పేర్లు బయటపెట్టినట్లు వార్తలు రాగా వారిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ ఉన్నట్లు తెలియడంతో ఈ కేసు సంచలంగా మారింది. రకుల్, సారా అలీ ఖాన్ లకు డ్రగ్స్ అలవాటు ఉందని, వీరు కూడా త్వరలో అరెస్ట్ కానున్నారని సంచలన కథనాలు వెలువడ్డాయి.
అయితే డ్రగ్స్ ఆరోపణలపై మీడియాలో వస్తున్న వార్తలలో ఎటువంటి నిజం లేదని ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ మల్హోత్రా ప్రకటన విడుదల చేశారు. రియా డ్రగ్ పెడ్లర్ ల సమాచారం మాత్రమే ఇచ్చారని, తమ వద్ద ప్రచారం జరుగుతున్నట్లుగా ఏ బాలీవుడ్ సెలెబ్రిటీలు నేరం చేసినట్లు ఆధారాలు లేవని అన్నారు.
గత రెండు రోజులుగా మీడియాలో రకుల్ మరియు సారా అలీ ఖాన్ పై దుష్ప్రచారం జరుగుతుండగా మల్హోత్రా ప్రకటనతో అందరూ వారి పట్ల సంఘీభావం ప్రకటించారు. ముఖ్యంగా హీరోయిన్ సమంత రకుల్ ప్రీత్ సింగ్ కి మద్దతుగా నిలిచారు. సోషల్ మీడియా ద్వారా రకుల్ పై జరిగిన దుష్ప్రచారానికి క్షమాపణలు చెప్పింది.
డ్రగ్స్ ఆరోపణల విషయంలో సమంత రకుల్ కి సపోర్ట్ గా నిలవడం సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. నిరాధారమైన ఆరోపణలు ఎదుర్కొన్న రకుల్ కి అందరూ తమ మద్దతు ప్రకటిస్తున్నారు.