సమంత తన బేబీతో నిద్రపోతుండగా.. కెమెరా క్లిక్మనిపించిన చైతూ
కరోనా లాక్ డౌన్ పేదలను కష్టాల పాలు చేస్తున్నా.. సినీ తారలకు మాత్రం మంచే చేసింది. ఎప్పుడు సినిమాలు, షూటింగ్లు, ప్రయాణాలతో బిజీగా ఉండే సెలబ్రిటీలు లాక్ డౌన్ కారణంగా ఇంటి పట్టునే ఉంటూ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ పర్సనల్ మూమెంట్స్ను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఆనందం పడుతున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ సమంత కూడా తన క్వారెంటైన్ డైరీస్ను అభిమానులతో షేర్ చేసుకుంది.
ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నసమంత, చైలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ఇద్దరి తమ పెట్ డాగ్ హష్ అంటే ప్రాణం. ఈ ఫ్రెంచ్ బుల్ డాగ్ను తమ కన్న బిడ్డల చూసుకుంటున్నారు సామ్, చై.
సమంత తన సోషల్ మీడియా పేజ్లో హష్కు సంబందించిన ఫోటోలను రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటుంది. క్వారెంటైన్ డేస్లోనూ తాను హష్తో గడుపుతున్న హ్యాపీ మూమెంట్స్ణు అభిమానులతో షేర్ చేసుకుంటుంది.
తాజాగా నాగచైతన్య తీసిన ఓ ఫోటోను సమంత నత ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేసింది. సమంత, హష్లు బెడ్ మీద పడుకొని ఉన్న ఆ ఫోటో పాటు `ఈ పని మా కన్నా బెటర్గా ఎవరు చేయలేరు` అంటూ కామెంట్ చేసింది.
అంతేకాదు కొద్ది రోజులు కిందట హష్ ఫోటోలను షేర్ చేసిన సమంత, నాగచైతన్య మాకు లాయల్ ఫ్రెండ్ అయిన ఈ పెట్ ను వదిలి పెట్టి ఉండలేకపోతున్నాం అంటూ కామెంట్ చేశారు.
గత నెలలో తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది సమంత. ఆ సమయంలో నాగచైతన్య స్వయంగా సమంత కోసం కేక్ను ప్రీపేర్ చేశాడు. ఆ ఫోటోలను తన ఇన్స్టా పేజ్లో షేర్ చేసిన సమంత తెగ మురిసిపోయింది.
టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ అనిపించుకుంటున్నారు నాగచైతన్య, సమంత. దాదాపు 8 ఏళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జోడి 2017లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తరువాత కూడా ఇద్దరు బిజీగా సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు.