'ఆర్ ఆర్ ఆర్' బిగ్ న్యూస్ :రిలీజ్ డేట్,షెడ్యూల్ పై నిర్మాత క్లారిటీ
ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా గురించిన వార్తలే. మొన్నటి వరకూ విదేశాలకు మాత్రమే పరిమితమనుకున్న ఈ భయానక వైరస్ ఇప్పుడు ఇండియాలో కూడా పుంజుకుంటూ జనాలను భయభ్రాంతులను చేస్తోంది. ఈ నేపధ్యంలో సినిమా థియోటర్స్ క్లోజ్ చేసారు. షూటింగ్ లు ఆగిపోయాయి. దాంతో పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ప్రశ్నార్దకంగా మారాయి. ముఖ్యంగా భారతదేశంలోని సినిమా ప్రియులంతా ఎదురు చూస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా రిలీజ్ మీద కూడా రకరకాల సందేహాలు నెలకొన్నాయి. ఆర్ ఆర్ ఆర్ ఈ నెల ప్రారంభం నుంచీ పూణే వెళ్లాల్సి ఉంది. అక్కడ భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసింది టీమ్. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ వల్ల షూటింగ్ ఆగిపోయింది. దాంతో పనులు పూర్తి చేసి, అనుకున్న టైమ్ కు రిలీజ్ చేయగలరా అనేది ప్రశ్నర్ధకంగా మారింది. ఈ వార్తలు నిర్మాత దానయ్యను సైతం చేరాయ. ఆయన మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏం చెప్పారంటే...
జనవరి 8,2021న రిలీజ్ చేస్తారని చెప్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా 2021 సమ్మర్ కు వాయిదా పడుతుందని వార్తలు బయిలు దేరాయి. దాంతో మిగతా పెద్ద సినిమా వాళ్లలో రిలీజ్ డేట్స్ ఖరారు కోసం కన్ఫూజన్ బయిలు దేరింది. వాళ్లు నిర్మాత దానయ్య కు ఫోన్ చేయటం మొదలెట్టారని సమాచారం.
అది అటు తిరిగి ఇటు తిరిగి మీడియాలోనూ డిస్కషన్ జరుగుతోంది. ఇది గమనించిన నిర్మాత డివివి దానయ్య ఈ వార్తలకు చెక్ చెప్పారని నిర్ణయించుకుని క్లారిటీ ఇచ్చారు. ఆయన చెప్పిన దాని ప్రకారం జనవరి 8న ఎట్టిపరిస్దితుల్లోనూ సినిమా రిలీజ్ అవుతుంది.
లాక్ డౌన్ పూర్తవగానే ముందనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ మొదలవుతుంది. ఆర్ ఆర్ ఆర్ నెక్ట్స్ షెడ్యూల్ గండిపేటలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో జరుగుతుంది. గండిపేట షెడ్యూల్ తర్వాత పూనేకు వెళ్తుంది టీమ్.
ఆలియా భట్ ఈ షెడ్యూల్ లో షూటింగ్ లో పాల్గొంటుంది. ఆమె ఆల్రెడీ ఏప్రియల్ నుంచి డేట్స్ ఇచ్చింది. అవి వేస్ట్ అవటంతో నెక్ట్స్ డేట్స్ పిక్స్ చేసి చెప్పింది. మరో ప్రక్క విఎఫ్ ఎక్స్ వర్క్ స్పీడుగా జరుగుతోంది అని చెప్పుకొచ్చారు.
దీంతో ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ సజావుగా సాగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేవాళ్లకు క్లారిటి ఇచ్చినట్లైంది. రాజమౌళి అదే ప్లానింగ్ మీద కూర్చుని , తన టీమ్ తో చర్చలు చేస్తున్నారట. అయితే అంతా స్కైప్, వాట్సప్ లోనే అంటున్నారు.
గండిపేట లో నిర్మించిన బ్రిడ్జ్ సెట్ లో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తారు. సినిమాలో ఆత్యంతం ఆసక్తికరంగా ఆ సన్నివేశాలు కనిపించనున్నాయని యూనిట్ చెబుతోంది. అంటే బ్రిటీష్ వాళ్లపై రామ్, భీమ్ యుద్ద సన్నివేశాలని తెలుస్తోంది.
అనంతరం యూనిట్ హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ కి షిప్ట్ కానుందని తెలుస్తోంది. ఆగస్టు నుంచి ఏకధాటిగా కొన్ని రోజుల పాటు డెహ్రాడూన్ పరిసరాల్లోనే షూటింగ్ జరగనుందిట.
దీనిలో భాగంగా షూటింగ్ కు అనుకూలంగా ఉండేలా కొన్ని చిన్న చిన్న సెట్స్ ను నిర్మిస్తున్నారుట. ఔట్ డోర్ షూట్ అనంతరం ఆ సెట్స్ లో కొన్ని సన్నివేశాలు షూట్ చేయనున్నారుట. ఇప్పటికే ఆర్ట్ డిపార్ట్ మెంట్ కు సంబంధించిన టీమ్ డెహ్రాడూన్ లో కొన్ని ఏర్పాట్లు చేసి వెయిట్ చేస్తున్నారట.
ఈ షెడ్యూల్ లో చరణ్, ఎన్టీఆర్ తో పాటు బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ కూడా పాల్గొంటాడుట. కానీ యూనిట్ ఇంకా ధృవీకరించలేదు.
ఈ సినిమా కోసం మొత్తం 450 కోట్లను ఖర్చు చేయనున్నారు. ఒక్క క్లైమాక్స్ కోసమే 150 కోట్లను కేటాయించినట్టుగా సమాచారం. రాజమౌళి సినిమాల్లో క్లైమాక్స్ కీలకం. ఈ సినిమాలో క్లైమాక్స్ మరింత ప్రాముఖ్యతను సంతరించుకుని ఒక రేంజ్ లో వుంటుందట. అందువలన ఈ క్లైమాక్స్ ఎపిసోడ్ పై ఈ స్థాయిలో ఖర్చు చేస్తున్నట్టుగా చెబుతున్నారు.
బిజినెస్ విషయానికి వస్తే...ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ..250 కోట్లకు అమ్మారంటున్నారు. స్టార్ గ్రూప్ వారు అన్ని భాషల డిజిటల్ రైట్స్ ఈ పెద్ద మొత్తానికి సొంతం చేసుకున్నారు. అంటే థియోటర్ బిజినెస్ కన్నా డిజిటల్ బిజినెస్ ఎక్కువ జరిగిందన్నమాట.
ఏ తెలుగు సినిమాకు జరగనంత బిజినెస్ ఈ సినిమాకు జరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమాకు ఏర్పడ్డ క్రేజ్ తో కోట్లు కుమ్మరిస్తున్నారు. అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 210 కోట్లు బిజినెస్ చేసినట్లు సమాచారం.