ప్రియుడు రణ్బీర్ని తీసుకుని మాల్దీవులకు బయలుదేరిన `ఆర్ఆర్ఆర్` హీరోయిన్ అలియాభట్..కరోనా నుంచి రిలీఫ్
`ఆర్ఆర్ఆర్` హీరోయిన్ అలియా భట్ మాల్దీవులకు బయలు దేరింది. తన ప్రియుడు, స్టార్ హీరో రణ్బీర్ కపూర్ని తీసుకుని మాల్దీవులకు చెక్కేసింది. కరోనా నుంచి కోలుకున్నాక ఈ జోడి మాల్దీవుల్లో రిలాక్స్ అయి రాబోతున్నారు.
గత నెలలో స్టార్ హీరో రణ్బీర్ కపూర్కి కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ అయ్యారు. ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నారు. అంతకు ముందే రణ్బీర్, అలియా కలిసి తిరిగారు.
ప్రస్తుతం బాలీవుడ్లో రణ్బీర్ కపూర్, అలియాభట్ హాట్ అండ్ క్రేజీ రొమాంటిక్ లవ్ కపుల్. చాలా రోజులుగా వీరిద్దరు గాఢమైన ప్రేమలో మునిగితేలుతున్నారు. ఈ నేపథ్యంలో రణ్బీర్తోపాటు కొన్ని రోజుల గ్యాప్తో అలియాభట్కి కరోనా సోకింది.
తనకు కూడా కరోనా వచ్చిందని ఆ మధ్య ఈ `ఆర్ఆర్ఆర్` హీరోయిన్ సోషల్ మీడియా ద్వారా పేర్కొని షాక్ ఇచ్చింది. దీంతో `ఆర్ఆర్ఆర్` టీమ్ సైతం ఆందోళన చెందింది.
అయితే త్వరగానే వీరిద్దరు కరోనా నుంచి కోలుకున్నారు. పూర్తిగా కరోనా నెగటివ్ అని తేలడంతో ఇక ఇన్ని రోజులు ఇంట్లోనే బంధీగా ఉన్న ఈ ప్రేమికులు స్వేచ్ఛా గాలులు పీల్చాలని డిసైడ్ అయ్యారు.
అందులో భాగంగానే మాల్దీవులకు చెక్కేస్తున్నారు. సోమవారం ఉదయం వీరిద్దరు ముంబయి ఎయిర్పోర్ట్ లో మెరిశారు. మాల్దీవులకు వెకేషన్కి వెళ్తున్నారు. కరోనా నుంచి రిలీఫ్ పొందుతూ నీలి సముద్రంలో ప్రేమ పాఠాలు చెప్పుకోవాలని భావిస్తున్నారు.
ముంబయి ఎయిర్పోర్ట్ వీరిద్దరు ఫోటోలకు చిక్కారు. తాజాగా ఆయా పిక్స్ నెట్టింట వైరల్గా మారాయి.
అలియాభట్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `ఆర్ఆర్ఆర్`లో రామ్చరణ్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నారు. దీంతోపాటు `గంగూబాయి కథియవాడి`, `బ్రహ్మాస్త్ర` చిత్రాల్లో నటిస్తుంది అలియా.
మరోవైపు రణ్బీర్ కపూర్ `బ్రహ్మాస్త్ర`లో అలియతో కలిసి రొమాన్స్ చేస్తున్నాడు. అలాగే `షంషేరా` అనే మరో సినిమా చేస్తున్నాడు.
ముంబయి ఎయిర్పోర్ట్ లో ఫోటోలకు చిక్కిన అలియా, రణ్బీర్ కపూర్.
ఎయర్పోర్ట్ లో అలియా.
ఎయిర్పోర్ట్ ఫ్లై కోసం క్యూలో ఉన్న రణ్బీర్, అలియా.
ఎయిర్పోర్ట్ లో లవ్ కపుల్ సందడి.