కోడిపుంజు దొరికింది..ఇక పెళ్ళెప్పుడు..రష్మీకి నెటిజన్ల ప్రశ్న
హాట్ యాంకర్ రష్మి ఎప్పుడూ గ్లామర్ ఫోటోలతో మెప్పిస్తుంది. కానీ ఈ సారి డిఫరెంట్గా మెప్పించింది. కోడిపుంజుతో సరదాగా గడిపింది. అంతేకాదు కోడిపుంజులను గౌరవించాలని తెలిపింది. దానిపై తన ప్రేమని ఒలకబోసింది. ఈ మేరకు ఫోటోని ఇన్స్టాలో షేర్ చేసింది.
అక్క అనసూయ మాదిరిగానే ఓవైపు టీవీ షోస్, మరోవైపు సినిమాలు చేస్తూ రాణిస్తుంది రష్మి గౌతమ్. టీవీ ఆడియెన్స్ నే కాదు, సినీ ఆడియెన్స్ ని సైతం కనువిందు చేస్తుంది.
తాజాగా రష్మి కోడిపుంజుతో సరదాగా గడిపింది. దానితో దిగిన ఫోటోలను పంచుకుంది. కోడిపుంజు ఉన్నది ప్లేట్లో మాంసంగానే కాదు, సమానంతో ప్రేమించబడాలి.
నైతిక హత్య అనేది కాదు, గౌరవంగా చనిపోనివ్వాలి. కోయిక్సిస్ట్ నేర్చుకుందామ`ని తెలిపింది.
ఓ ఫంక్షన్లో కోడిపుంజుతో రష్మీ దిగిన ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. కోడిపుంజు దొరికింది, మరి పెళ్ళెప్పుడు అని అంటున్నారు. మరికొందరు అప్పుడు కుక్కలు, ఇప్పుడు కోళ్ళా? అంటూ సెటైర్లు వేస్తున్నారు.
రష్మీ ప్రస్తుతం `ఎక్స్ ట్రా జబర్దస్త్` షోతోపాటు `అక్కా ఎవరే అతగాడు`, అలాగే `బొమ్మబ్లాక్ బస్టర్` చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది.