కాబోయే వాడితో రామ్చరణ్ భామ బ్రేకప్? ఇన్స్టాలో ప్రియుడి ఫోటోలు డిలీట్ చేసిన అమీ జాక్సన్.. వైరల్
రామ్చరణ్ హీరోయిన్ అమీ జాక్సన్ తన ప్రియుడికి బ్రేకప్ చెప్పిందా? కాబోయే వాడితో విభేదాలు వచ్చాయా? తనకు ఒంటరిగానే ఉంటే సంతోషంగా ఉందా? అంటే అవుననే వార్తలు సోషల్ మీడియా నుంచి వినిపిస్తున్నాయి.
రామ్చరణ్తో `ఎవడు` చిత్రంలో నటించి పాపులర్ అయ్యింది అమీ జాక్సన్. తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా తన అందంతో తెలుగు ఆడియెన్స్ ని కట్టిపడేసింది.
చివరగా మూడేళ్ల క్రితం రజనీకాంత్తో `2.0` చిత్రంలో నటించి మెస్మరైజ్ చేసిన అమీ జాక్సన్ ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉంది.
బ్రిటీష్కి చెందిన ఈ సెక్సీ అందాల భామ బ్రిటీష్కి చెందిన వ్యాపారవేత్త జార్జ్ పనాయోటౌతో ప్రేమలో పడింది. చాలా కాలంగా వీరిద్దరు ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్నారు.
దాదాపు ఆరేళ్లుగా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు. ఎట్టకేలకు 2019లో మ్యారేజ్ చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ ఏడాది మే 6న వీరిద్దరు లండన్లో అత్యంత సన్నిహితుల సమక్షంలో ప్రైవేట్ సెర్మనీగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు.
గతేడాది పెళ్లి చేసుకోవాలనేది వీరి ప్లాన్. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది.అయితే 2019 సెప్టెంబర్ 23లోనే అమీ పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. అతనికి ఆండ్రియాస్ అనే పేరు పెట్టారు.
పెళ్లికి ముందే వీరిద్దరు పేరెంట్స్ కావడం హాట్ టాపిక్గా మారింది. బ్రిటీష్ కల్చర్లో అది కామనే అయినా ఆమె ఇండియన్ అభిమానులు మాత్రం అదొ విచిత్రంగానే భావించారు.
అయితే తన ప్రియుడితో అనేక సందర్బాల్లో దిగిన ఫోటోలను ఇన్స్టాలో పంచుకుంది అమీ జాక్సన్. కానీ ఇటీవల వాటిని ఆమె తొలగించారు. ప్రస్తుతం తన ప్రియుడు జార్జ్ కి సంబంధించిన ఫోటో ఒక్కటి కూడా లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది.
దీంతో అమీ,జార్జ్ బ్రేకప్ చెప్పుకున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. వీరిద్దరు విడిపోవడం వల్లే అమీ.. జార్జ్ ఫోటోలను డిలీట్ చేసి ఉంటుందని ఇంటర్నేషనల్ మీడియా కోడై కూస్తోంది.
అంతేకాదు ఇటీవల అమీ తన కుమారుడు ఆండ్రియాస్తో దిగిన ఫోటోని పంచుకుంటూ హ్యాపీనెస్ అని షేర్ చేసింది.
తనకు కుమారుడే తనకు సంతోషాన్నిస్తుందనే విషయాన్ని ఆమె వెల్లడించింది. మరి దీనిపై అమీ ఏంస్పందిస్తుందనేది ఇప్పుడు సస్పెన్స్ గా, హాట్ టాపిక్గా మారింది.
అమీ జాక్సన్ `మద్రాస్ పట్టిణమ్` చిత్రంతో హీరోయిన్గా పరిచయమైంది. `ఐ`, `థెరి`, `సింగ్ ఈజ్ బ్లింగ్`, `దేవి` వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది.
అమీ జాక్సన్ గ్లామర్ ఫోటోలు.