ఆ పుకార్లకు రకుల్ స్ట్రాంగ్ కౌంటర్... డేట్స్ అడ్జస్ట్ చేసే వాళ్ళుంటే నేను రెడీ అంటున్న ఢిల్లీ బ్యూటీ!
కెరీర్ సాఫీగా సాగుతున్నా, వివాదాలతో సతమతం అవుతుంది రకుల్ ప్రీత్ సింగ్. గత ఏడాది ముంబై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు డ్రగ్స్ ఆరోపణలపై ఆమెను విచారణకు పిలిచారు. తాజాగా టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆమె పేరు వినిపిస్తుంది.
డ్రగ్స్ మాఫియాతో టాలీవుడ్ ప్రముఖులకు ఉన్న సంబంధాలు, మనీ లాండరింగ్ వంటి విషయాలపై ఆరా తీస్తున్న ఈడీ, రకుల్ ని విచారించడం జరిగింది.
అలాగే కొన్నాళ్లుగా తెలుగులో రకుల్ సినిమాలు తగ్గించారు. దీనితో ఆమెకు టాలీవుడ్ లో ఆఫర్స్ రావడం లేదంటూ నెట్టింట్లో వార్తలు హల్ చల్ చేశాయి. ఇక తనపై వస్తున్న కథనాలపై రకుల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
ప్రస్తుతం తన చేతిలో అరడజను సినిమాలున్నాయని.. కొత్త ప్రాజెక్ట్స్ కోసం టైమ్ కేటాయించేలేకపోతున్నట్లుగా వివరణ ఇచ్చింది. తన డేట్స్ అడ్జెస్ట్ చేసే వాళ్లుంటే.. ఎవరైనా తనను సంప్రదించాలని రివర్స్ కౌంటర్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం తెలుగులో మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తోన్న కొండపొలం సినిమాలో నటిస్తోంది రకుల్. అలాగే ప్రస్తుతం ఈ అమ్మడు హిందీ సినిమాల్లోనే నటిస్తుంది.
ఇప్పటికే బాలీవుడ్లో ఈ అమ్మడు చేతినిండా ప్రాజెక్ట్స్తో బిజీగా గడిపేస్తుంది. మేడే, థాంక్ గాడ్ అంటూ అజయ్ దేవగణ్ సినిమాల్లో నటిస్తోంది. అలాగే తమిళంలోనూ ఓ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తుంది. అలాగే ఆయుష్మాన్ ఖురానా ప్రధాన పాత్రలో నటిస్తున్న డాక్టర్ జీ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇందులో డాక్టర్ ఫాతిమా పాత్రలో రకుల్ కనిపించనుంది.
ఈ సందర్భంగా.. ఈ మూవీలో తన పాత్రకు సంబంధించి ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. రకుల్ మాట్లాడుతూ.. వైద్య వృత్తి ఎంతో బాధ్యతాయుతమైనది. ఈ సినిమా కోసం డాక్టర్లను ఫాలో అయ్యాను. డాక్టర్ కోటు ధరించగానే.. ఏదో బాధ్యతాయుతమైన ఫీలింగ్ నన్ను ఆవహించేది. నేను నిజమైన డాక్టర్ను కాననీ. డాక్టర్గా నటిస్తున్నానని తెలిసినప్పటికీ ఫాతిమా ఉన్నంతసేపు ఏదో బాధ్యత ఫీలయ్యాను అంటూ చెప్పుకొచ్చింది రకుల్.
పాత్ర పరంగా నేను పేషెంట్స్ను ట్రీట్ చేస్తున్నప్పుడు డాక్టర్స్ ఎంత బాధ్యతగా వ్యవహరించాలో.. వారి జీవితాలు ఎంత కష్టంగా ఉంటాయో తెలిసింది. ఫాతిమాగా కెమెరా ముందుకు వెళ్లిన తర్వాత నేను రకుల్ను కాదు అనిపించేది… పూర్తిగా ఆ పాత్రలో లీనమైపోయాను. ఆ అనుభవం నాతో ఎప్పటికీ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది రకుల్.