కొత్త లుక్లో రకుల్ని చూసి షాకైన ఫ్యాన్స్.. దారుణమైన ట్రోలింగ్.. కారణం అందుకేనా?
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ షాక్ ఇస్తుంది. జీరో సైజ్ అందాలతో కనిపిస్తూ మైండ్ బ్లాక్ చేస్తుంది. మరీ సన్నగా మారిపోవడంతో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు.
రకుల్ ప్రీత్ సింగ్ మొన్నటి వరకు కాస్త యావరేజ్ లుక్లో కనిపించింది. ఓ అమ్మాయి ఎంత వెయిట్ ఉండాలో, పర్ఫెక్ట్ కొలతలు మెయింటేన్ చేసింది. కానీ ఇప్పుడు సడెన్గా ఇలా మరీ సన్నగా మారిపోయి కనిపించడం అందరిని షాక్కి గురి చేస్తుంది.
గ్రాజియా అనే మేగజీన్ కోసం ఇలా రెడీ అయి కనిపించింది. ఫోటో షూట్కి హాట్ హాట్ పోజులతో మతిపోగొట్టింది. ఇందులో రకుల్ ఇచ్చిన యాంగిల్స్ కొన్ని షాక్ ఇస్తున్నాయి.
దీంతో ఆమె అభిమానులు తీవ్రనిరాశకి గురవుతున్నారు. రకుల్ ఫోటోలను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
మరికొందరైతే ఏకంగా అస్తిపంజరంతో పోల్చుతున్నారు. `ఏమొచ్చింది మరీ అస్థిపంజరంలా ఇలా అయిపోయావేంటి` అంటున్నారు.
అయితే రకుల్ ఇలా మారడానికి కారణాలు వెతకగా షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్కే పరిమితమైంది.
తెలుగులో వైష్ణవ్తేజ్తో ఓ సినిమా చేస్తుంది. అది దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ అమ్మడికి టాలీవుడ్లో ఆఫర్లు లేవు.
హిందీలో మాత్రం వరుసగా ఆఫర్లని దక్కించుకుంటూ దూసుకుపోతుంది. తెలుగులో హీరోయిన్ అంటూ కాస్త బరువెక్కే ఉండాలి. తెలుగు ఆడియెన్స్ కూడా అలానే కోరుకుంటారు.
కానీ బాలీవుడ్లో సీన్ రివర్స్. అక్కడ జీరో సైజ్ అందాలకే డిమాండ్ ఎక్కువ. బొద్దుగా కనిపిస్తే యాక్సెప్ట్ చేయరనే టాక్ ఉంది. మరి అందుకేనేమో రకుల్ ఇలా జీరో సైజ్కి మారిపోయింది.
ఈ లెక్కన బాలీవుడ్లో రకుల్ పాగా వేయాలని గట్టిగానే ప్రయత్నం చేస్తుందని చెప్పొచ్చు. అదే సమయంలో పలు విమర్శలు కూడా వస్తున్నాయి. బాలీవుడ్ భామలంతా తెలుగు వైపు చూస్తుంటే రకుల్ మాత్రం నార్త్ కి వెళ్లడమేంటి? అంటున్నారు.
`వెంకటాద్రి ఎక్స్ప్రెస్` సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్సింగ్ అతి తక్కువ కాలంలోనే వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరితో జతకట్టింది. కొన్నాళ్లుగా పరాజయాలు పలకరించడంతో ఈ అమ్మడు బాలీవుడ్కి మకాం మార్చింది.
ఫిజికల్ ఫిట్నెస్పై రకుల్కు ఉన్న శ్రద్ధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కొంతకాలంగా రకుల్ శరీరాకృతిలో వచ్చిన మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిత్యం భారీ వర్కవుట్లు చేస్తూ మరీ సన్నగా మారిపోయింది.
ప్రస్తుతం హిందీలో రకుల్ `అయలాన్`, `ఎటాక్`, `మేడే`, `థ్యాంక్ గాడ్`, `డాక్డర్ జీ`తోపాటు తెలుగులో క్రిష్-వైష్ణవ్ తేజ్ సినిమా, తెలుగు,తమిళంలో `అక్టోబర్ థర్టీఫస్ట్ లేడీస్నైట్` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.