యూఎస్లో ఫ్యాన్స్ తో రజనీ బిజీబిజీ.. చూస్తుంటే కుర్రాడికి ఏమాత్రం తక్కువ లేరుగా!
సూపర్ స్టార్ రజనీకాంత్ అమెరికాలో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఓ వైపు హెల్త్ చెకప్ చేసుకుంటూనే మరోవైపు అభిమానులతోనూ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. తాజాగా ఫ్యాన్స్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రజనీకాంత్ అభిమానులతో ముచ్చటిస్తున్న ఫోటోలు బయటకు వచ్చాయి. అవి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో ఆయన ఉన్నారు.
ఇందులో ఇద్దరు మహిళలు, ఓ అబ్బాయి ఉన్నారు. కాసేపు వీరు సరదాగా ముచ్చటించుకున్నారు. వారితో మాట్లాడుతున్న సమయంలో రజనీకాంత్ ఎంతో ఎనర్జీగా కనిపించారు.
అంతేకాదు రజనీ గెడ్డం నడిసింది కానీ రంగేస్తే కుర్రాడికి ఏమాత్రం తీసిపోడు. తాజాగా ఈ ఫోటోల్లో ఆయన్ని చూస్తుంటే అలానే కనిపిస్తున్నారు. వయసుని జయిస్తున్నారనిపిస్తుంది.
ఇటీవల భార్య లత రజనీకాంత్తో కలిసి అమెరికా వెళ్లారు. 2016లో రజనీ ఇక్కడే కిడ్నీ మార్పిడి సర్జరీ చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన జనరల్ చెకప్ కోసం అమెరికాకు రెగ్యూలర్గా వెళుతుంటారు. ఇప్పుడు కూడా అలాగే వెళ్లినట్టు తెలుస్తుంది. కూతరు ఐశ్వర్య, అల్లుడు, హీరో ధనుష్ కూడా అమెరికాలోనే ఉన్నారు.
Rajinikanth
ఇదిలా ఉంటే రజనీ ఇటీవల ఓ ఆసుపత్రి బయట కనిపించిన ఫోటో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే రజనీ ఆరోగ్యంపై తమిళ రైటర్ వైరముత్తు చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. రజనీ ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే తిరిగి ఇండియాకి వస్తున్నారని తెలిపారు. దీనిపై చిన్మయి లాంటి వారు స్పందించి వైరముత్తుపై విమర్శలు గుప్పించారు.
మరోవైపు రజనీపై నటి కస్తూరి విమర్శలు చేశారు. గత మె నెల నుంచి భారతీయులపై అమెరికా నిషేధం విధించింది. హెల్త్ ఎమర్జెన్సీ అయినా రావడానికి వీల్లేదని తెలిపారు. మరి రజనీ అంత అర్జెంట్గా ఎందుకు వెళ్లాల్సి వచ్చింది. ఇండియాలోనే చెకప్ చేయించుకోవచ్చుగా, రాజకీయ ఎంట్రీపై తప్పించుకునేందుకే రజనీ అమెరికా వెళ్లారు. ఆయన పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇవ్వాలని ఆమె ట్వీట్ చేశారు.
Rajinikanth
ఇక రజనీకాంత్ ప్రస్తుతం `అన్నాత్తే` చిత్రంలో నటిస్తున్నారు. కీర్తిసురేష్, నయనతార, మీనా, ఖుష్బు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శివకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారు.
Annaatthe