కార్ డ్రైవర్ కాపలాగా ఉండేవాడు, దేవీశ్రీని మొదట కలిసింది అప్పుడే...హీరోయిన్ పూజిత పొన్నాడ సంచలన వ్యాఖ్యలు
విశాఖకు చెందిన తెలుగు అమ్మాయి పూజిత పొన్నాడ హీరోయిన్ గా ఎదగాలనే ప్రయత్నాలలో ఉన్నారు. దర్శకుడు చిత్రంతో హీరోయిన్ గా మారిన పూజిత పొన్నాడ, రంగస్థలం మూవీలో ఆది లవర్ రోల్ చేశారు.
అందం అభినయం ఉన్నా, సరైన బ్రేక్ అయితే రాలేదు. అరడజనకు పైగా చిత్రాలలో నటించినా అన్నీ ప్రాధాన్యం లేని పాత్రలే. తెలుగు అమ్మాయిలకు సరైన ప్రాధాన్యం దక్కదనడానికి పూజిత పొన్నాడనే నిదర్శనం.
హీరోయిన్ గా ఎదగడానికి అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్న పూజిత, తాజా ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు తెలియజేశారు.
హీరోయిన్ అవుతానంటే పేరెంట్స్ ఒప్పుకున్నారా అని యాంకర్ అడుగగా... అస్సలు ఒప్పుకోలేదని పూజిత చెప్పారు. ఎక్కడ షూటింగ్ కి వెళ్లినా తన కార్ డ్రైవర్ ఫాలో చేస్తూ ఉండేవాడట.
పూజిత పేరెంట్స్ తన పట్ల అంత కేరింగ్ గా ఉండేవారని ఆమె చెప్పారు. ఉద్యోగం తరువాత సినిమాను కెరీర్ గా ఎంచుకోవడం వాళ్లకు నచ్చలేదని పూజిత చెప్పడం జరిగింది.
ఇక దేవి శ్రీ ప్రసాద్ పూజిత పొన్నాడ మధ్య సంథింగ్ సంథింగ్ అని వార్తలు రావడం జరిగింది. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా పుకార్లు వచ్చాయి.
ఈ విషయంపై పూజిత స్పందించారు. రంగస్థలం 100 డేస్ ఫంక్షన్ లో మొదటిసారి ఆయనను కలిసినట్లు పూజిత పొన్నాడ చెప్పారు. ఆ తరువాత ఆయన్ని నేను మళ్ళీ ఎప్పుడూ కలిసింది లేదు, కేవలం అవి పుకార్లు మాత్రమే అన్నారు.
ఇక బిగ్ బాస్ లో అవకాశం వచ్చినా ఎందుకు వెళ్లలేదని అడుగగా...నేను చాలా ప్రైవేట్ పర్సన్ అని, అన్ని కెమెరాల మధ్య గడపడం ఇష్టం లేక వెళ్లలేదని చెప్పారు.
ఇక పరిశ్రమలో గాడ్ ఫాదర్ ఉంటే అడ్వాంటేజ్ ఉంటుందని, అవకాశాలు అందిపుచ్చుకోవచ్చని అన్నారు.
ఓటిటి కంటెంట్ లో నటించేందుకు ఆమెకు అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తుండగా, పలు చిత్రాలలో కనిపించనున్నారట.