అప్పుడు కన్నుగీటితో.. ఇప్పుడు పాటతో ఫిదా చేయబోతున్న ప్రియా ప్రకాష్ వారియర్
ఒక్క కన్నుగీటుతో యావత్ దేశాన్నే ఒక్కసారిగా తన వైపు తిప్పుకుంది ప్రియా ప్రకాష్ వారియర్. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె కన్నుగీటుకి అంతా పడిపోయారు. నెట్లో తనని సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. డే అండ్ నైట్లో భారీ క్రేజ్ని సొంతం చేసుకుందీ బ్యూటీ. తాజాగా పాట పాడిందీ బ్యూటీ. మరి ఇప్పుడెంత మంది పడిపోతారో..
ప్రియా ప్రకాష్ వారియర్.. మలయాళంకు చెందిన ఈ అందం `ఒరు ఆడార్ లవ్` చిత్రంలో నటించింది.
ఈ సినిమాలో `మాణిక్య మలరాయ పూవై` అనే పాటలు ప్రియా కన్ను గీటింది. అందుకు కోట్ల మంది ఆమె ప్రేమలో పడిపోయారు.
దీంతో ఆమెనే డ్రీమ్ గర్ల్ గా ఊహించుకున్న కుర్రాళ్లు ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు. అంతగా ఈ బ్యూటి ఫిదా చేసింది. తన మాయలో పడేసుకుంది. ఒక్కసారిగా పాపులర్ అయ్యింది.
ఆ సినిమాలో నిజానికి ప్రియా సెకండ్ హీరోయిన్. ఈ పాటతో వచ్చిన ఇమేజ్, పాపులారిటీతో తనని పాత్రని మెయిన్గా మార్చారు.
తెలుగులోనూ ఈ సినిమా `లవర్స్ డే`గా విడుదలైంది. దీంతో టాలీవుడ్లోనూ ఈ బ్యూటీకి మంచి గుర్తింపు వచ్చింది.
దీంతో టాలీవుడ్లో ఈ అమ్మడికి ఆఫర్స్ వరించాయి. అందులో భాగంగా ప్రస్తుతం నితిన్ సరసన `చెక్` చిత్రంలో నటిస్తుంది.
ఇందులో నితిన్కి లవ్ ఇంట్రెస్ట్ గా కనిపించబోతుంది ప్రియా. ఇప్పటికే విడుదల చేసిన రొమాంటిక్ ఫోటో విశేషంగా ఆకట్టుకుంది.
ఇక ఇప్పుడు గాయనిగా మారింది. తనలో నటి మాత్రమే కాదు, మంచి గాయని కూడా ఉందని నిరూపించుకుంది. అయితే ఆమె పాట తెలుగులో పాడటం విశేషం.
సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల ఓ ప్రైవేట్ ఆల్బమ్ రూపొందించారు. ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్తో ఓ పాటని ఆలపింప చేశారు. ఇది రికార్డింగ్ కూడా పూర్తయ్యింది.
గతంలో ఓ మలయాళ పాట పాడారు ప్రియా. అయితే ఇప్పుడు తెలుగులో పాడటం విశేషంగా నిలిచింది. ఇది మంచి ఎనర్జితో కూడిన పెప్పీ సాంగ్ అని, పాడేటప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యానని ప్రియా తెలిపింది.