ప్రభాస్ మూవీస్ లైనప్..బాబోయ్ ఇంత పెద్దదా? ఐదేళ్లు నో డేట్స్ !
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్. ఆయన చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్లో ఉంటుంది. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా నాలుగైన సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ ఐదేళ్లు ప్రభాస్ని టచ్ చేసే వాళ్లే లేరంటే అతిశయోక్తి కాదు.
ప్రస్తుతం ఇప్పుడు టాలీవుడ్లోనే కాదు ఇండియన్ సినిమాల్లోనే అత్యంత బిజీ స్టార్. బిగ్ స్టార్ కూడా. అత్యధికంగా సినిమాలను లైన్లో పెట్టిన హీరో కూడా. ప్రస్తుతం ఆయన ఓకే చేసిన సినిమాలు చూస్తుంటే మరో ఐదేళ్ల వరకు తీరిక లేకుండా ఉన్నారని చెప్పొచ్చు.
ప్రస్తుతం ప్రభాస్ `రాధేశ్యామ్`లో నటిస్తున్నారు. పీరియాడికల్ లవ్ స్టోరీ ఇది. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమా దాదాపు చివరి దశకు చేరుకుంది. `జిల్` ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దీన్ని రూపొందిస్తున్నారు. జులై 30న ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి కొంత భాగం రీ షూట్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
దీంతోపాటు ప్రభాస్ `సలార్` షూటింగ్లో పాల్గొంటున్నారు. `కేజీఎఫ్` ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. ఇప్పటికే కొంత భాగం చిత్రీకరణ జరిగింది. రేపటి నుంచి మరో షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా, ఇది మైనింగ్ నేపథ్యంలో, మైనింగ్లోని ఓ నాయకుడి పోరాటం ప్రధానంగా సాగుతుందని తెలుస్తుంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల కానుంది.
బ్యాక్ టూ బ్యాక్ ప్రభాస్ `ఆదిపురుష్` సినిమాలో నటిస్తున్నారు. రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రానికి బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపిస్తున్నాడు. సీత పాత్రలో కృతిసనన్ నటిస్తుంది. ఈ సినిమా కూడా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.
భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల కానుంది. పాన్ ఇండియా చిత్రంగా తెలుగు, హిందీలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్ట్ 11న విడుదలకు చిత్ర బృందం ప్లాన్ చేస్తుంది. ఇప్పుడు కరోనా విజృంభన, షూటింగ్లో ఆలస్యమవడం, పలు ఇబ్బందుల కారణంగా ఈ సినిమా విడుదల తేదీలో మారే అవకాశం ఉందని టాక్. వచ్చే ఏడాది చివర్లోగానీ, లేదంటే 2023 ఫస్ట్ ఆఫ్లో రానుందనే ప్రచారం జరుగుతుంది.
ఈ రెండు పూర్తయిన తర్వాత ప్రభాస్ మరో పాన్ ఇండియా చిత్రం `మహానటి` ఫేమ్ నాగ్ అశ్విన్తో చేయబోతున్నారు. అశ్వనీదత్ తన బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న భారీ బడ్జెట్ చిత్రం. ప్రస్తుతం రూపొందుతున్న ప్రభాస్ సినిమాల్లోనే అత్యంత భారీ బడ్జెట్, భారీ స్కేల్ ఉన్న సినిమా ఇదే అని చెప్పొచ్చు. సైన్స్ ఫిక్షన్గా దీన్ని ఓ సరికొత్త జోనర్లో ప్రజెంట్ చేయబోతున్నారు నాగ్ అశ్విన్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్నారు. ఈ చిత్రం కంప్లీట్ కావడానికి దాదాపు రెండేళ్లు పట్టే అవకాశం ఉంది. అంటే ఇది రిలీజ్ అవ్వాలంటే 2024వరకు ఆగాల్సిందే.
దీంతోపాటు మరో బాలీవుడ్ దర్శకుడితో ప్రభాస్ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారట. `వార్` ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమాకి ప్రభాస్ ఓకే చెప్పాడనే ప్రచారం కూడా జరుగుతుంది. ఇది `వార్`కి సీక్వెల్గా ఉండబోతుందనే ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఈ సినిమా ఓకే అయితే 2025 ఎండింగ్లోగానీ, 2026లోగానీ ఈ చిత్రం విడుదలవుతుంది.
ఈ లెక్కల ప్రకారం ప్రభాస్ ఐదేళ్లపాటు తీరిక లేకుండా ఉన్నారు. బ్యాక్ టూ బ్యాక్ భారీ చిత్రాలతో అలరించబోతున్నారు. ఫ్యాన్స్ ని ఖుషీ చేయబోతున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఆయన సినిమాల లైనప్ చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి ఇంత బిజీ టైమ్లో ప్రభాస్ మ్యారేజ్కి టైమ్ ఎలా కేటాయిస్తాడనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అప్పటి వరకు వెయిట్ చేస్తాడా? మధ్యలోనే కానిస్తాడా? అన్నది చూడాలి.