పీకే మాస్క్తో పూనమ్ కౌర్... మళ్లీ వివాదానికి తెర తీసిందా?
ఎప్పటికప్పుడు వివాదాస్పద ట్వీట్లతో వార్తల్లో నిలవటం పూనమ్ కౌర్ అలవాటు. సినిమాలకు దూరమై చాలా కాలమే అవుతున్నా.. కాంట్రవర్సియల్ ట్వీట్స్తో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంది ఈ బ్యూటీ. తాజాగా మరోసారి ఇంట్రస్టింగ్ ట్వీట్తో హెడ్లైన్స్లో నిలిచింది పూనమ్ కౌర్.
టాలీవుడ్ లో సినిమాలు చేయకపోయినా వివాదాస్పద ట్వీట్లతో ఫేమస్ అయిన అందాల భామ పూనమ్ కౌర్. ఈ బ్యూటీ ఎప్పుడు ఎవరి మీద ఎలాంటి ట్వీట్ చేస్తుందో ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎక్కువగా వైరాగ్య భావంతో ట్వీట్లు చేసే ఈ బ్యూటీ అప్పుడప్పుడూ వివాదాస్పద ట్వీట్లతోనూ అలరిస్తుంటుంది.
గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీని ఉద్దేశిస్తూ `ఓ అబద్దాల కోరు రాజకీయ నాయకుడు కాగలడు కానీ లీడర్ కాలేడు` అంటూ ట్వీట్ చేసి పవన్ అభిమానుల ఆగ్రహానికి గురైంది. అదే సమయంలో త్రివిక్రమ్ మీద కూడా వివాదాస్పద ట్వీట్లు చేసింది పూనమ్.
ఇటీవల పీకే లవ్స్ అనే హ్యాష్ ట్యాగ్తో ట్వీట్ లు చేసి మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే పీకే అంటూ పూనమ్ కౌర్ అని చెపుతున్నా అదే పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేస్తున్న ట్వీట్లే అని భావిస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా మరోసారి పీకే అనే అక్షరాలను తెర మీదకు తీసుకువచ్చింది.
ప్రస్తుతం కరోనా సీజన్ కావటంతో మాస్క్లు ధరించటం తప్పని సరి అయ్యింది. దీంతో డిజైనర్ మాస్క్లకు డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో పూనమ్ కూడా డిజైనర్ మాస్క్లను ఆర్డర్ ఇచ్చింది. వాటి సాంపుల్స్ రావటంతో అవి చూపిస్తూ ట్వీట్ చేసింది పూనమ్.
కొంత మంది ప్రేమ కోసం నా సిగ్నేచర్ను చేశారు. నాకు నచ్చిన వ్యక్తుల కోసం కస్టమైజ్డ్ మాస్క్లు ఆర్టర్ ఇచ్చాను. వాళ్లు సాంపుల్ గా ఈ మాస్క్లను ఇచ్చారు. ఇవి నాకు చాలా నచ్చాయి. ఈ మాస్క్లు డబ్ల్యూ హెచ్ వో గైడ్ లైన్స్ మేరకు రూపొందించారు. అంటూ ట్వీట్ చేసింది.
అంతేకాదు అభిమానుల క్యూరియాసిటీని మరింత పెంచేలా ఈ మాస్క్ను ఓ ప్రత్యేకమైన వ్యక్తికి, ఈ మధ్య అత్యంత గౌరవించబడుతున్న వ్యక్తికి ఇవ్వాలలనుకుంటున్నా అంటూ కామెంట్ చేసింది. పూనమ్, పవన్ ను ఉద్దేశించే ఈ కామెంట్స్ చేసిందని భావిస్తున్నారు.