ప్రభాస్ 20: కీ సీక్రెట్ లీక్ చేసేసిన పూజ, షాక్ లో టీమ్
సినిమా రిలీజ్ కు ముందు ఎంత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తే అంతలా జనాల్లో నానుతుంది. అదే అంతులేని పబ్లిసిటీ ఇస్తుంది. అందుకే తెలివైన దర్శక,నిర్మాతలు తమ సినిమాలో అసలు మ్యాటర్ బయిటకు వెళ్లకుండా కొద్ది కొద్దిగా క్లూలు ఇస్తూ సినిమాపై క్యూరియాసిటీ పెంచే ప్రయత్నం చేస్తారు. బాహుబలి ప్రమోషన్ స్టాటజీ చూసాక ఈ టెక్నిక్ మరీ పాపులర్ అయ్యింది. రిలీజ్ అయ్యేదాకా గుప్పెట మూసి ఉంచాలని హీరో,హీరోయిన్స్ కు క్లియిర్ గా చెప్తున్నారు.
అయితే ఒక్కోసారి పొరపాటునో,కావాలనో టీమ్ సినిమాకు సంభందించిన కొన్ని సీక్రెట్స్ లీక్ చేసేస్తూంటారు. అలాంటిదే పూజ హెడ్గే తన తాజా చిత్రం విషయంలో చేసిందని చెప్తున్నారు. ఆ సినిమా మరేదో కాదు ప్రభాస్ తో చేస్తున్న చిత్రం కావటంతో అందరి దృష్టీ ఇటే పడింది. తాజాగా ఓ వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజా హెగ్డే ఈ చిత్రం గురించి ముచ్చటించి కీలకమైన సమాచారాన్ని చెప్పేసారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.
అతి తక్కువ కాలంలోనే మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీయార్ వంటి స్టార్ హీరోల సరసన మెరిసిన అందం పూజా హెగ్డే. ముఖ్యంగా అల వైకుంఠపురములో సూపర్ హిట్ తో ఆమె క్రేజ్ ఆకాశాన్ని అంటింది.
ఈ నేపధ్యంలో పూజ నటిస్తోందంటే ఆ సినిమాకు ట్రేడ్ సర్కిల్స్ లో ఓ రేంజిలో క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం పూజ.. యంగ్ రెబల్స్టార్ ప్రభాస్తో నటిస్తోంది.
డైరెక్టర్ జిల్ రాధాకృష్ణ రూపొందుతోన్న ఈ పీరియాడిక్ లవ్స్టోరీ ప్యాన్ ఇండియా లెవిల్ లో భారీగా రూపొందుతోంది. ఇందులో ప్రభాస్కు జోడీగా పూజ నటిస్తోంది. ఇటీవలె జార్జియాలో షూటింగ్ పూర్తయింది.
ఇన్నాళ్లూ ఈ సిననిమా బ్రీజీ రొమాంటిక్ ఫన్ ఎంటర్టైనర్ అని మీడియాలో,ఫ్యాన్స్ లో ప్రచారం జరుగుతోంది. బాహుబలి,సాహో చిత్రాలకు భిన్నంగా నవ్విస్తూ సాగే లవ్ స్టోరీ అనుకుంటున్నారు. అయితే పూజ ఈ విషయమై క్లారిఫై చేస్తూ ఈ సినిమా చాలా సీరియస్ కథ,కథనంతో సాగుతుందని చెప్పుకొచ్చింది. దాంతో ఇది విన్నవాళ్లంతా షాక్ అవుతున్నారు. టీమ్ అయితే ఇలా అసలు విషయం చెప్పేసిందేమిటా అనుకుంటున్నారట.
అలాగే ఈ సినిమా షూటింగ్ చాలా భాగం పెండింగ్ ఉందని క్లారిటీ ఇచ్చింది. ఇదీ ఫ్యాన్స్ కు షాకే. ఎప్పుడో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ దాదాపు ఫినిషింగ్ కు వచ్చిందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఆమె ఆ విషయంపై క్లారిటీ ఇఛ్చేసింది.
టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో తనకు అసలు ఐడియా లేదని అంది. అంటే టీమ్ కూడా ఈ విషయం మీద ఓ మాట అనుకోలేదన్నమాట. లేదా కావాలనే తన ద్వారా ఈ మ్యాటర్ బయిటకు రావటం ఎందుకని పూజ భావించి ఉండవచ్చు.
ఇక ఫైనల్ గా ఈ సంవత్సరం ఈ సినిమా రిలీజ్ కాకపోవచ్చని చెప్పేసింది. ఎందుకంటే కరోనా దెబ్బతో షూటింగ్ ఆగిపోవటంతో అనుకున్న తేదీకి సినిమా జనం ముందుకు రాకపోవచ్చని హింట్ ఇచ్చేసింది. ఇది ప్రభాస్ అభిమానులకు కాస్తంత బాధ కలిగించే వార్తే. అయితే నిర్మాతలు ఈ విషయమై ఇంకా ఏమీ స్పష్టత ఇవ్వలేదు.
తర్వాతి షెడ్యూల్లో ప్రభాస్కు, నాకు మధ్య రొమాంటిక్ సీన్స్ను తెరకెక్కించనున్నారని పూజ చెప్పింది. అయితే ఆ షెడ్యూల్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది అవగాహన లేదని అంది.
`ప్రభాస్ ఇంతవరకు కనిపించని స్టైల్తో, బాడీ లాంగ్వేజ్తో ఈ సినిమాలో కనిపించనున్నాడు. ప్రతీ ఫ్రేమ్ ఓ విజువల్ వండర్గా ఉంటుంది. నాకే అలా అనిపిస్తే ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా ఫీలవుతారో ఊహించగలను.
ఇక ప్రభాస్ సినిమా సెట్లో నిశ్శబ్దంగా ఉండరని, సెట్లో ప్రభాస్ చాలా సరదాగా ఉంటారు. ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటారు. ఆయనతో కలిసి షూటింగ్ చాలా చక్కగా ఉంటుంది అని పూజా హెగ్డే చెప్పింది
‘లాక్డౌన్ కన్నా ముందే భారత్కు తిరిగి రావడం మా అదృష్టం. జార్జియాకు వెళ్లే ముందు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా. కరోనా నేపథ్యంలో వీలైనంత తొందరగా భారత్ రావాలనే ఉద్దేశంతో షూటింగ్ను ముందుగానే ముగించుకున్నాం అంది.జార్జియా నుంచి ఇంటికి రాగానే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయా.’ అని చెప్పారు.
సల్మాన్ ఖాన్ నటించబోతున్న ‘కబి ఈద్ కబి దివాళి’ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ పాత్ర పోషించబోతున్నారు. ‘ఈ సినిమా చర్చల దశ ముగిసిన తర్వాత.. హీరోయిన్ గా నన్ను తీసుకున్నారని సమాచారం వచ్చింది. ఆ సమయంలో ఎంతో సంతోషంగా అనిపించింది. సల్మాన్తో కలిసి పనిచేయడం కోసం ఎదురుచూస్తున్నా’ అని చెప్పుకొచ్చింది.
యూరప్ నేపథ్యంలో రూపొందిస్తున్నచిత్రం ఇది. ఇటీవల ఈ చిత్రం జార్జియా షూటింగ్ షెడ్యూల్ పూర్తయింది. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీని ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్దితుల్లో ఎంత వరకూ సాధ్యం అనేది వేచి చూడాల్సిన విషయం.