రూట్ మార్చిన బన్నీ హీరోయిన్ పూజా హెగ్డే.. హాట్ యాంగిల్ కాదు.. ట్రెడిషనల్ యాంగిల్లోనూ కేక
పూజా హెగ్డే టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్. ఎందుకంటే గతేడాది `అల వైకుంఠపురములో` వంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో హీరోయిన్గా నటించింది. ఇప్పుడు హాట్ బ్యూటీ ట్రెడిషనల్గా కనిపించి కేకపెట్టించింది. పర్పుల్ స్పార్కుల్ కుర్తాలో మెరిసింది. సమ్మర్ ప్రారంభంలో ఇలా ట్రెడిషనల్గా రెడీ అయి తన అభిమానులకు షాక్ ఇచ్చింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
పూజా హెగ్డే ఆ మధ్య ఔట్ ఫిట్ గౌనులో కనువిందు చేసింది. ఆయా ఫోటోలు కూడా బాగా ఆకట్టుకున్నాయి. కానీ దానితో పోల్చితే ఇప్పుడు పూజా మరింతగా హంట్ చేస్తుంది.
పర్పుల్ స్పార్కుల్ కుర్తాలో, దానికి మ్యాచింగ్ కలర్ ప్యాంట్ ధరించింది. ట్రెండిషనల్ లుక్లో పోజులిచ్చి ఆకట్టుకుంది.
ప్రస్తుతం పూజా ఈ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకోగా అవి బాగా వైరల్ అవుతున్నాయి.
కెరీర్ ప్రారంభంలో గ్లామరస్గా పోజులిచ్చింది పూజా. పొదుపు దుస్తుల్లో దుమారం సృష్టించింది.
కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొట్టింది. ఫ్యాన్ ఫాలోయింగ్ని పెంచుకుంది. సోషల్ మీడియాలోనూ ఫాలోయింగ్ని పెంచుకుంది.
`అల వైకుంఠపురములో` అల్లు అర్జున్.. పూజా కాళ్లని చూడటమనేది హైలైట్ చేశారు దర్శకుడు త్రివిక్రమ్.
నిజంగానే పూజా తొడలు అంత సెక్సీ గా ఉంటాయని నెటిజన్ల మాట. ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పారు.
బహుశా త్రివిక్రమ్కి ఆ ఆలోచన రావడం వెనకాల కూడా ఇలాంటి కామెంట్లే కారణం అయి ఉంటుంది.
అయితే ఈ మధ్య ఏమైందో ఏమో.. పూజా ట్రెడిషనల్ లుక్ని అస్సలు తగ్గడం లేదు. ఎక్కడ చూసినా నిండుగా కప్పుకుని కనిపిస్తుంది.
చాలా వరకు సాంప్రదాయానికి ప్రయారిటీ ఇస్తుంది. ఇదే ఇప్పుడు తన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పూజాలో వచ్చిన ఈ మార్పుకి కారణమేంటని అడుగుతున్నారు.
ఆ మధ్య తెలుగు సినిమాల్లో బొడ్డుని, నడుములను, గ్లామరస్గా చూపించేందుకు ఇష్టపడతారని, టాలీవుడ్ మొత్తం నడుముచుట్టే తిరుగుతుందని కామెంట్ చేసి వివాదాల్లో ఇరుక్కుంది పూజా.
దీనిపై పెద్ద దూమారమే రేగడంతో క్షమాపణలు చెప్పింది. తాను అలా మాట్లాడలేదని వెల్లడించింది. టాలీవుడ్ తనకు లైఫ్ ఇచ్చిందని చెప్పింది.
ఇదిలా ఉంటే ప్రస్తుతం పూజా.. ప్రభాస్తో కలిసి `రాధేశ్యామ్`లో, అఖిల్తో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్` చిత్రాల్లో నటిస్తుంది.
పూజా ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.