First Published Apr 16, 2020, 3:17 PM IST
భారతదేశమంతా లాక్ డౌన్ లో ఉంది. జనమంతా ఎవరి కాలక్షేపాలు వాళ్లు చూసుకుంటున్నారు. పొలిటీషన్స్ ఒకరి మీద మరొకరు బురద జల్లుకుంటున్నారు. మరికొంతమంది కరోనా పై వాట్సప్,ఫేస్ బుక్ లలో పోస్ట్ లు పెడుతూ బిజీగా ఉంటున్నారు. మరి సెలబ్రెటీలు..ముఖ్యంగా హీరోయిన్స్ ఏం చేస్తున్నారు అంటే...ఇదిగో ఇలా అందాలు ఆరబోసే పోగ్రాం పెట్టుకుంటున్నారు. తెరపై రోజూవారీ అందాలు పండించే ఈ ముద్దు గుమ్మలు ఖాళీగా ఉన్నసమయాల్లోనూ అదే పని మీద ఉంటున్నారు. అఫ్ కోర్స్ తమ అభిమానులకు ఆనందం కలిగిస్తున్నారు. కాస్తంతం మెంటల్ రిలీఫ్ ఇస్తున్నారు అని వీళ్లని చాలా మంది మెచ్చుకుంటున్నారు కూడా. ఇదిగో ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న పూజ హెడ్గే కూడా అదే పనిలో ఉంది. ఆమె తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు చూస్తే ఆ విషయం మీకూ అర్దం అవుతుంది.
నాగచైతన్య 'ఒక లైలా కోసం'తో పరిచయమైన పూజ ఆ తర్వాత వరుణ్ తేజ్ సరసన 'ముకుంద' సినిమాలో నటించి తెలుగు వారికి మరింతగా దగ్గరైంది.
తన తొలి సినిమాలు రెండూ డిజాస్టర్స్ అయినా..వరుసగా తెలుగులో ఆఫర్స్ అందిపుచ్చుకుంటూ ప్రస్తుతం తెలుగులో చాలా బీజీగా ఉన్న హీరోయిన్లో ఒకరుగా ఉంది.
ఈ భామ టాప్ హీరోల అందరితోను ఆడిపాడింది. ఆమెను హీరోలే తమ సినిమాల్లో రికమెండ్ చేసే స్దాయికి ఎదిగింది. నిర్మాతలు సైతం ఆమె అడిగినంత ఇచ్చి తమ సినిమాల్లోకి తీసుకుంటున్నారు.
అల్లు అర్జున్ సరసన 'డీజే' లోహాట్గా అదరగొట్టిన ఈ భామ.. ఎన్టీఆర్తో 'అరవింద సమేత'లో కుర్రాళ్ల మనస్సులను అలా అలవోకగా పట్టేసి, మైమరిపించింది.
తర్వాత మహేష్ బాబుతో కలసి ‘మహర్షి’లో చేసి మంచి హిట్ అందుకోవటం ప్లస్ అయ్యింది. దాంతో ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. సోషల్ మీడియాలోనూ ఆమె తన హవా చూపిస్తోంది.
రీసెంట్ గా బన్ని సరసన అలవైకంఠపురములో నటించి బుట్ట బొమ్మ అనిపించుకుంది. త్రివిక్రమ్ ఆమెకు రాసిన డైలాగులకు జనం ఫిదా అయ్యిపోయారు.
వరుస హిట్లతో ఊపు మీద ఉన్న ఈ ముద్దుగుమ్మ మరో అవకాశాన్ని అందుకుంది. తమిళ్లో అదిరిపోయే ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది.
సూర్య, డైరెక్టర్ హరి కాంబినేషన్లో ఓ చిత్రం వస్తోంది. ఈ సినిమాలో సూర్య కి జంటగా పూజ హెగ్డే ని తీసుకొనే ఆలోచనలో ఉందట చిత్రం టీమ్.
దీంతో ఊపుమీద వున్న పూజ, తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. కుర్రకారు మతులు పోగొడుతోంది.
తాజాగా లాక్డౌన్లో హాట్ ఫోటోలతో మతి పోగొడుతోంది. ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. కుకింగ్ వీడియో నుంచి , ఆటులు ఆడేదాకా అన్ని పోస్ట్ చేస్తోంది.
తన కుటుంబంతో ఈ లాక్ డౌన్ పీరియడ్ లో హ్యాపీగా గడుపుతున్నానని చెప్తోంది. అందుకు సంభందించిన ఫొటోలతో ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటోంది.
తమ బోర్ ని ఈ రకంగా పోగొట్టుకుంటోందని చెప్తోంది. సర్లే ఎంతసేపు అవే ఫొటోలు షేర్ చేస్తామనుకుందో ఏమో కాస్తంత స్పైసీగా సెల్ఫ్ ఫొటో వదిలింది.
ఈ ఫొటో ఎంత బాగా క్లిక్ అయ్యి వైరల్ అయ్యిందంటే ఆరు లక్షలుకు పైగా లైక్స్ వచ్చాయి. ఆమెకు ఇనిస్ట్రగ్రమ్ లో 10.1 మిలియన్ ఫాలోయిర్స్ ఉన్నారు.
ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కరోనా వైరస్ కారణంగా సామాన్య ప్రజలు మొదలుకొని సెలెబ్రిటీల వరకు ఇళ్లకే పరిమితమై ఉంటున్నారు. అందులో భాగంగా కొందరు బొమ్మలేస్తూ కాలం గడుపుతుంటే పూజ వంటిట్లో చేరి వంటలు చేస్తున్నారు.
ఇక పూజా ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ సినిమా చేస్తోంది. అందులో ఆమె పాత్ర చాలా క్యూట్ గా ఉంటోందని తెలుస్తోంది. ఓ ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
అలాగే అఖిల్ హీరోగా వస్తోన్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్లర్ అనే సినిమాలోను నటిస్తోంది. అందులో ఆమె స్టాండప్ కమిడియన్ గా కనిపించనుంది.
వీటికి తోడు హిందీలో సల్మాన్తో పాటు అక్షయ్ సినిమాలో కూడా పూజా నటించనుంది. వాటితో జాతీయ గుర్తింపు వస్తుందని భావిస్తోంది.
మొన్నటి దాకా జార్జియాలో షూటింగ్ జరుపుకున్న ప్రభాస్ సినిమా కరోనా వైరస్ కారణంగా షూటింగ్కు బ్రేక్ పడింది. దీనితో పూజా ప్రస్తుతం ఖాలీగా ఉంది. జార్జియా నుంచి ఇంటికి రాగానే స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయింది.
ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. సెట్లో ప్రభాస్ చాలా సరదాగా ఉంటూ.. ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు. ఆయనతో పనిచేయడం చాలా ఆనందంగా ఉందని ఈ మూవీలో ప్రభాస్తో తన కెమిస్ట్రీ చాలా బాగా ఉంటుందని చెప్పింది పూజ.
సల్మాన్ ఖాన్ హీరోగా వస్తోన్న ‘కబి ఈద్ కబి దివాళి’ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించనుంది. ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.