పవన్ మిగతా అన్నీ పక్కన పెట్టి ఆ సినిమాని స్టార్ట్ చేశాడు..కారణమేంటి?
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా ప్రారంభమైంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన `అయ్యప్పనుమ్ కోశియమ్` చిత్ర రీమేక్ని సోమవారం ఉదయం ప్రారంభించారు. పూజా కార్యక్రమాలతో ఈ సినిమాని ప్రారంభించారు. ఇందులో త్రివిక్రమ్, నిర్మాత ఎస్.రాధాకృష్ణ వంటి వారు పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు హల్చల్ చేస్తున్నాయి.
ఇందులో దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి పవన్ కళ్యాణ్ క్లాప్ నివ్వగా, అతిథిగా విచ్చేసిన త్రివిక్రమ్ కెమెరా స్విచాన్ చేశారు. ప్రముఖ నిర్మాత ఎస్.రాధాకృష్ణ(చినబాబు) దర్శకుడు సాగర్ కె.చంద్రకి స్రిప్ట్ అందించారు.
ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇందులో మరో పాత్రలో దగ్గుబాటి రానా నటిస్తున్నారు. సినిమా ప్రారంభం సందర్భంగా ఆయన కూడా తన సంతోషాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
ప్రస్తుతం సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2021 జనవరిలో షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినిమాకి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల కెమెరామెన్గా పనిచేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్. ఏఎస్.ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభం కానుందట.
ఇదిలా ఉంటే పవన్ చివరగా ఒప్పుకున్న ఈ సినిమాని ఫస్ట్ ప్రారంభించడం ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఆయన దీని కంటే ముందు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా, హరీష్ శంకర్తో మరో సినిమా చేయాల్సి ఉంది. దీంతోపాటు సురేందర్రెడ్డితోనూ ఓ సినిమాకి కమిట్ అయినట్టు సమాచారం. కానీ ఈ రీమేక్ సినిమా తక్కువ టైమ్లోనే పూర్తి కానుంది. డేట్స్ కూడా తక్కువే అవసరం అవుతాయి. దీంతో ఫస్ట్ ఈ సినిమాని పూర్తి చేయాలని భావిస్తున్నారు.
మరోవైపు క్రిష్ డైరెక్షన్లో రూపొందే సినిమా లావిష్గా ఉండబోతుంది. హిస్టారికల్, పీరియడ్ అంశాలుండటంతో దానికి చాలా టైమ్ పడుతుంది. అందుకోసమే ముందుగా వీటిని పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నారట. అలాగే హరీష్ శంకర్తో సినిమా కూడా టైమ్ పడుతుంది.
ప్రస్తుతం నటిస్తున్న `వకీల్సాబ్` త్వరలోనే పూర్తి కానుంది. ఆ వెంటనే `అయ్యప్పనుమ్ కోశియమ్` రీమేక్కి పూర్తి చేసుకుని క్రిష్, హరీష్ శంకర్ చిత్రాలను బ్యాక్ టూ బ్యాక్ షూట్ చేసి 2022లో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.