పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఖరీదు 300కోట్లా?.. బయటకొస్తున్న షాకింగ్ విషయాలు!
పవన్కల్యాణ్ రెండేళ్ల రాజకీయాల బిజీ తర్వాత గతేడాది రీఎంట్రీ ఇచ్చారు. వరుసగా ఐదు సినిమాలకు కమిట్ అయ్యారు. వెలుగులోకి రానివి మరో రెండు మూడు ఉన్నాయట. అయితే పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఖరీదు తెలిస్తే మాత్రం మతిపోతుంది. దాదాపు మూడు వందల కోట్లు ఆయన ఖాతాలోకి చేరబోతున్నట్టు సమాచారం.
పవన్ కళ్యాణ్ చివరగా `అజ్ఞాతవాసి` సినిమాలో నటించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి బిజీ అయ్యారు. ఏపీ ఎలక్షన్లో ఓడిపోయిన పవన్ తన ఖాతాలో డబ్బులు ఖాళీ అయ్యాయట. దీంతో డబ్బుల కోసం, తన మెయింటనేన్స్, పార్టీ నిర్వాహణ, ఇల్లుగడవడం కోసం సినిమాలు చేస్తున్నా అని బహిరంగంగానే చెప్పారు పవన్. దీంతో ఇది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
పవన్ రీఎంట్రీ తర్వాత మొదట `పింక్` రీమేక్ `వకీల్సాబ్`కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా, నివేతా థామస్, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టీజర్ని సంక్రాంతి కానుకగా ఈ నెల 14న సాయంత్రం విడుదలైంది. కోర్ట్ లో వాదించడమే కాదు, కొట్టడం కూడా తెలుసు అనే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది.
డైలాగే కాదు, టీజర్ కూడా భారీ వ్యూస్తో దూసుకుపోతుంది. ఇప్పటికే ఇది పది మిలియన్స్ కి పైగా వ్యూస్ని రాబట్టినట్టు తెలుస్తుంది. అయితే దీన్ని `కేజీఎఫ్2` పోటీపడుతుందా అనే కామెంట్లు వినిపించాయి. ఆ సినిమా రేంజ్ వేరు, `వకీల్ సాబ్` సినిమా వేరు. దానితో కంపేర్ చేయడానికి లేదు. పైగా `కేజీఎఫ్` ఐదు భాషల్లో టీజర్ని విడుదల చేశారు.
దీంతోపాటు ఇటీవల పవన్ మలయాళ సూపర్ హిట్ `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్ని ప్రారంభించారు. దీనికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. రానా మరో హీరోగా నటిస్తున్నారు. ఇద్దరు ఈగోయిస్టుల మధ్య జరిగే ఘర్షణ ప్రధానంగా సినిమా సాగనుంది.
దీనికి త్రివిక్రమ్ డైలాగులు, స్క్రీన్ప్లే అందిస్తున్నారు. ఈ విషయాన్ని చిత్ర బృందం తాజాగా వెల్లడించింది. సంక్రాంతి సందర్భంగా పవన్ అభిమానులకు మంచి కబురు చెప్పింది.
అలాగే క్రిష్ డైరెక్షన్లో మరో సినిమా చేస్తున్నారు పవన్. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ని కూడా ఇటీవల ప్రారంభించారు. ఇది పీరియాడికల్ నేపథ్యంలో సాగే భారీ బడ్జెట్ సినిమా. సాగర్ చంద్ర సినిమా, క్రిస్ చిత్రాన్ని ఏక కాలంలో పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత హరీష్ శంకర్తో సినిమా చేయబోతున్నారట పవన్. ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. ఇక సెట్స్ పైకి తీసుకెల్లడమే మిగిలి ఉంది. అలాగే సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఓ సినిమా కమిట్ మెంట్ ఉంది.
దీంతోపాటు డాన్స్ మాస్టర్ జానీ డైరెక్షన్లో ఓ సినిమాకి కమిట్ అయ్యారట. ఇవే కాకుండా మరో రీమేక్ సినిమా కూడా పవన్ ఖాతాలో ఉందని టాక్.
ఇదిలా ఉంటే పవన్ రీఎంట్రీ ఇస్తూ నటిస్తున్న నేపథ్యంలో సినిమాలపై విపరీతమైన క్రేజ్ నెలకొంది. ఆ క్రేజ్కి తగ్గట్టే పవన్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. ప్రస్తుతం ఆయన ఒక్కో సినిమాకి యాభై కోట్ల నుంచి యాభై ఐదు కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తుంది. జీఎస్టీ విడిగా తీసుకుంటున్నారట.
ఈ లెక్కన పవన్ ఆరు సినిమాలకు మూడువందల నుంచి మూడు వందల యాభై కోట్ల వరకు ఆయన ఏకకాలంలో తన అకౌంట్లో వేసుకోబోతున్నారని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇలా పవన్ రీఎంట్రీ విలువ దాదాపు మూడు వందల కోట్లు అని చెప్పొచ్చు. ఆర్థిక ఇబ్బందులున్నాయని, పార్టీని నడపడం కష్టంగా ఉందని చెప్పి, ఈ నిర్వహణ కోసమే పవన్ రీఎంట్రీ ఇచ్చారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఏదేమైనా పవన్ రీఎంట్రీఇవ్వడం ఆయన అభిమానులను ఖుషీ చేస్తుంది. అదే సమయంలో టాలీవుడ్లోనూ సినిమాల హంగామా మరింత పెరిగింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా పవన్పై దాదాపు ఐదు వందల కోట్ల వ్యాపారం జరుగుతుందని చెప్పొచ్చు.