ఫ్యాన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తున్న పవన్ కళ్యాణ్.. న్యూ ఇయర్లో కొత్త డౌట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులను కన్ఫ్యూజ్ చేస్తున్నాడా?.. వరుస సినిమాలకు కమిట్ అయి ఫ్యాన్స్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడా? ఏ సినిమాని ఎప్పుడు స్టార్ట్ తెలియక అయోమయానికి గురి చేస్తున్నాడా? అంటే అవుననే సమాధానం ఆయన అభిమానులను నుంచి వినిపిస్తుంది. మరి ఈ కన్ ఫ్యూజన్ గోలేంటో ఓసారి చూస్తే..
న్యూ ఇయర్ సందర్భంగా పవన్ని దర్శకుడు హరీష్ శంకర్, త్రివిక్రమ్, నిర్మాతలు ఎస్.రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ, బండ్ల గణేష్, రవిశంకర్ వంటి వారు కలిసి విషెస్ తెలిపారు.
ఇందులో హరీష్ శంకర్ విషెస్ తెలియజేశారు. ఇందులో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ కూడా ఉన్నారు. అంతేకాదు `పవన్ కళ్యాణ్ 28వ సినిమా వైబ్స్` అనే కామెంట్ చేశారు.
మరోవైపు త్రివిక్రమ్, ఎస్.రాధాకృష్ణ, నాగవంశీ కలిసి వెళ్లారు. వీళ్లంతా మర్యాదపూర్వకంగా కలిసినా, ముగ్గురు ఒకేసారి కలవడం పలు కొత్త డౌట్లను క్రియేట్ చేస్తుంది. వీరి కాంబినేషన్లో మరో సినిమా సెట్ కాబోతుందా? అనే వార్తలకు బీజం వేస్తుంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న `వకీల్ సాబ్` షూటింగ్లో తన పార్ట్ షూటింగ్ని పూర్తి చేసుకున్నారు పవన్. న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన లుక్ ఆకట్టుకుంది.
త్వరలోనే మలయాళ చిత్రం `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్ చిత్రంలో పాల్గొనబోతున్నారు. దీనికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రానా మరో హీరోగా నటిస్తారు.
దీంతోపాటు క్రిష్ డైరెక్షన్లో సినిమా తెరకెక్కాల్సి ఉంది. ఈ సినిమాపై అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి. ఇప్పట్లో ఈ సినిమా ఉంటుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ప్రస్తుతం పవన్ ప్లాన్ ప్రకారం `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్తోపాటు హరీష్ శంకర్ సినిమాని ఏకకాలంలో సెట్పైకి తీసుకెళ్లే ఛాన్స్ ఉన్నట్టు టాక్.
మరి బండ్ల గణేష్ సినిమా, త్రివిక్రమ్ సినిమాల పరిస్థితేంటి? మున్ముందు లెక్కలన్నీ మారిపోతాయా? అనే కొత్త డౌట్లు క్రియేట్ అవుతున్నాయి. బండ్ల గణేష్ చాలా సార్లు నా దేవుడు ఓకే చెప్పాడనే కామెంట్ చేశారు. మరోవైపు త్రివిక్రమ్తో పవన్ మరో సినిమా చేయబోతున్నారనే టాక్ వినిపించింది. ఈ నేపథ్యంలో తాజా కలయికలు అనేక కొత్త డౌట్లను క్రియేట్ చేస్తున్నాయి.