నటి ఎఫైర్స్..మీడియాకు ఎక్కిన భర్త, హోటల్లో దొరికింది
బయిట ప్రపంచంలో ఎన్నో అక్రమ విషయాలు జరుగుతూంటాయి. కానీ అవి మీడియాకు ఎక్కక పోవటంతో ఎక్కడక్కడే పెద్ద టాపిక్ గా మారకుండా ఉండిపోతూంటాయి. కానీ సెలబ్రెటీల విషయం అలా కాదు..కొద్దిగా మ్యాటర్ జరిగిందంటే అది మీడియా కోడై కూస్తుంది. సోషల్ మీడియా రచ్చ రచ్చ చేసేస్తుంది. అలాంటిది అక్రమ సంబంధం అదీ ఓ నటీ అంటే ఊరుకుంటుందా..ఇప్పుడు బాలీవుడ్ మీడియా మొత్తం ఆమె మీదే దృష్టి పెట్టింది. ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని హంగామా చేస్తున్నారో లేక నిజంగానే ఇబ్బంది పడుతున్నాడో కానీ సదరు భర్త...నటి అయిన తన భార్యని రోడ్డు మీదకు లాగే ప్రయత్నం చేసాడు. నాలుగు సార్లు ఆమె ఇలాంటి వెధవ పనిచేసిందని మరీ ఆవేదన చెందాడు. ఇంతకీ ఎవరా నటి...ఏం జరిగింది...చివరకు కంక్లూజన్ ఏమిటి వంటి విషయాలు చూద్దాం.
టీవి నటి పవిత్ర పునియా కు వివాహం కాలేదని చాలా మంది అనుకున్నారు. కేవలం నిశ్చితార్దమే అయ్యిందని ఆమె కూడా అంది. అయితే అనుకోనివిధంగా ఆమెకు ఓ హోటల్ యజమాని అయిన సుమిత్ మహేశ్వరితో వివాహం అయ్యిందని తేలింది.
ఇన్నాళ్లూ ఆమె కెరీర్ దృష్ట్యా ముందుగా అనుకున్న మాట ప్రకారం తమ బంధాన్ని దాచేసారు ఆమె భర్త. అయితే ఆమె వేరే వారితో అక్రమసంభందం నడుపుతూండటంతో తనకు వేరే దారిలేక మీడియాకు ఎక్కి ఆ విషయం రివీల్ చేయాల్సి వచ్చిందంటున్నారు.
ఈ నేపధ్యంలో తన భార్య అని ఆ హోటల్ యజమాని అయిన సుమిత్ మహేశ్వరి అన్నారు. ఆ విషయం ఇప్పుడు టీవి ఇండస్ట్రీలో సెన్సేషన్ గా మారింది. ఆమెకు వివాహం కాలేదని చనువు ప్రదర్శించి, దగ్గర అవుదామనుకున్నవాళ్లకు ఇది షాక్ ఇచ్చింది.
పవిత్ర ‘లవ్ యు జిందగీ’తో కెరీర్ ఆరంభించి అనేక పాపులర్ సీరియల్స్ తో ఆకట్టుకున్నారు. తనకు నిశ్చితార్థమైందని, కానీ... దాన్ని రద్దు చేసుకున్నానని నటి ఓసారి చెప్పింది. ఆ తర్వాత చాలా సార్లు మాట మారుస్తూ వచ్చింది. తన వివాహ విషయం మాట్లాడటానికి ఇష్టం లేదన్నట్లు బిహేవ్ చేసింది.
అయితే పవిత్రతో వివాహమైందని, దాన్ని ఆమె సీక్రెట్ గా ఉంచారని సుమిత్ మీడియా ముందుకు వచ్చారు. ఆమె మరో టీవీ నటుడు పరాస్ ఛబ్రాను కూడా మోసం చేశారని తెలిపారు.
ఆమె భర్త మీడియాతో మాట్లాడుతూ... మేము ఇప్పటికీ భార్యాభర్తలమే. మా ఇద్దరికీ నిశ్చితార్థమైంది, పెళ్లి కూడా జరిగింది. కానీ పవిత్ర బయటికి చెప్పనివ్వలేదు. నా భార్యగా ఉంటూనే పరాస్ ఛబ్రాను ప్రేమించింది అని ఆవేదనతో అన్నారు.
అలాగే వీరి ప్రేమ గురించి తెలిసిన తర్వాత నేను పరాస్కు మెసేజ్ చేశా. పవిత్రతో ప్రేమను కొనసాగించొచ్చని.. కానీ విడాకులు వచ్చేంత వరకు ఆగమని చెప్పాను. నా కుటుంబ సభ్యులు కూడా జోక్యం చేసుకున్నారు. కానీ పరిస్దితుల్లో మార్పు రాలేదు. ఆమె తన ఎఫైర్స్ కొనసాగిస్తూనే వస్తోంది.
అయితే ఆమెకు ఇది మొదటి సారి మాత్రం కాదు. ఇప్పటికి నలుగురుతో ఎఫైర్స్ నడిపింది. పరాస్ ఛబ్రియా, ప్రతీక్ షేజ్ పాల్, మరో వ్యక్తి ఇండస్ట్రీకి సంభందం లేని వాడు. అలాగే ఇప్పుడు ఇజాజ్ ఖాన్. వీళ్లంతా ఆమెతో ఎఫైర్ నడుపినవారే అని తేల్చి చెప్పాడు.
ఆమె మీద నా ప్రేమ ఉండటమే ఇన్నాళ్లు ఈ విషయం దాచి ఉంచటానికి కారణం. ఇప్పటికీ నా చేతిపై పవిత్ర టాటూ ఉంది. ఆమె పూర్తిగా మారిపోయింది, నాలో ఎటువంటి మార్పు రాలేదు. అని ఆమె భర్త అన్నారు.
తొలుత పరాస్తో ఆమె అతి చనువుగా ఉందని తెలుసుకుని షాకయ్యా. మా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకొన్న అదే గోవా హోటల్లో పవిత్ర, పరాస్ ఉన్నారని తెలుసుకుని ఎంతో బాధపడ్డా. నా భార్య వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. ఆమె ప్రేమలో నిజాయితీ లేదు’ అని సుమిత్ పేర్కొన్నారు.
హిందీ బిగ్బాస్ 13 కంటెస్టెంట్ పరాస్ చబ్రా తన మాజీ ప్రియురాలు, బిగ్బాస్ 14 కంటెస్టెంట్ పవిత్ర పునియా గురించి సంచలన విషయాలు వెల్లడించాడు. ‘ఆమె తన పెళ్లి విషయం దాచి పెట్టి నాతో డేటింగ్ చేసింది’ అంటూ ఆరోపించాడు పరాస్.
గతంలో పవిత్ర ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పరాస్ తన జీవితంలో చేసిన అతి పెద్ద మిస్టేక్ అని తెలిపింది. దీనిపై అతడు స్పందిస్తూ.. ‘అవును ఆమె మాటలు నిజమే. ఎందుకంటే ఓ వివాహిత తనకు పెళ్లి అయ్యిందనే విషయాన్ని దాచి పెట్టి.. నన్ను ఫూల్ని చేయాలని చూసింది. అదృష్టం కొద్ది నేను ఈ బంధానికి ముగింపు పలికాను’ అన్నాడు.
పెళ్లైన మహిళ మరో పురుషుడిని ప్రేమించడం, మోసం చేయడం తప్పని బుల్లితెర నటుడు పరాస్ పవిత్రను ఉద్దేశిస్తూ కొన్ని రోజుల క్రితం అన్నారు. ‘ఆమె భర్త నాకు మెసేజ్ చేయడం వల్ల నిజం తెలుసుకున్నా. పవిత్రను ప్రశ్నిస్తే.. నిజమేనని చెప్పింది. ఆ తర్వాత ఆమె గురించి మరో షాకింగ్ విషయం తెలిసింది. ఇప్పుడు దాన్ని బయటపెట్టను’ అని చెప్పారు.
‘ఒక రోజు పవిత్ర భర్త నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. ‘మీరిద్దరు ఒకర్ని ఒకరు చాలా ఇష్టపడుతున్నారు. కలిసి జీవిద్దాం అనుకుంటున్నారు. ఇవన్ని జరగాలంటే నేను ఆమెకు విడాకులు ఇవ్వాలి’ అని మెసేజ్ చేశాడు. అది చూసి నేను షాక్కు గురయ్యాను.
ఆ తర్వాత ఆరా తీయడంతో ఆమె పాత రిలేషన్స్ అన్ని తెలిసాయి. దాంతో ఆమె నుంచి విడిపోయాను. నేను గనక ఇప్పుడు వాటి గురించి నోరు విప్పితే.. ఆమె చాలా బ్యాడ్ అవుతుంది. ఆమెకే మంచిది కాదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
పరాస్, పవిత్ర మొదట ఓ రియాలిటీ షో ద్వారా కలుసుకున్నారు. ఆ తర్వాత టీవీ పరిశ్రమలోకి ప్రవేశించారు. ప్రస్తుతం పవిత్ర పునియా పలు సీరియళ్లలో నటిస్తున్నారు.