ఫ్యామిలీతో కలిసి ఎన్టీఆర్ లాంగ్ వెకేషన్.. కొరటాల సినిమా షూటింగ్ అప్డేట్ తెలిస్తే ఫ్యాన్స్ కి టార్చరే?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కొరటాలతో సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. కానీ తారక్ వారికి మరోసారి షాక్ ఇచ్చాడు. ఫ్యామిలీతో కలిసి విహార యాత్రకి వెళ్లడం ఇప్పుడు ఆశ్చర్యపరుస్తుంది.
ఎన్టీఆర్(NTR) తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ వెళ్తున్నారు. రెండు నెలల క్రితమే ఫ్యామిలీ టూర్ వేసిన ఆయన ఇప్పుడు మరోసారి విహారయాత్రకి వెళ్తున్నారు. తాజాగా అమెరికాకి వెళ్తున్నట్టు తెలుస్తుంది. భార్య ప్రణీత, కుమారుడు భార్గవ్ రామ్, అభయ్ రామ్లతో కలిసి ఎన్టీఆర్ యూఎస్ చెక్కేశారు. Jr Ntr Family Vacation Photos.
తాజాగా ఎయిర్పోర్ట్ లో వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. అక్కడి ప్రముఖ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఎన్టీఆర్ లుక్ అదరగొడుతుంది. బ్లాక్ టీషర్ట్ ధరించి ఉన్నాడు తారక్. ఫుల్ గెడ్డంతో ఎన్టీఆర్ లుక్ ఆకట్టుకునేలా ఉంది.
ఆ మధ్యనే ఫ్యామిలీతో వెకేషన్ వెళ్లొచ్చారు ఎన్టీఆర్. ఆ తర్వాత జపాన్లో `ఆర్ఆర్ఆర్` ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. కొన్ని రోజులు అక్కడ సరదగా గడిపిన ఆయన తిరిగి వచ్చాక కొరటాల శివ మూవీని స్టార్ట్ చేస్తారని భావించారు. అందుకు బలాన్ని చేకూర్చేలా మ్యూజిక్ సిట్టింగ్లో కొరటాల ఉన్న ఫోటోలను విడుదల చేశారు.
అనిరుథ్ తో ఆయన సీరియస్ సిట్టింగ్లో ఉన్నారు. బ్యాక్ టూ బ్యాక్ ఇలా ఫోటోలు రావడంతో ఆల్మోస్ట్ షూటింగ్ స్టార్ట్ అయ్యే దశకు వచ్చిందని భావించారు. ఈ నెలలోగానీ, జనవరి వరకు గానీ స్టార్ట్ అవుతుందనే ఆశతో అభిమానులంతా ఉన్నారు. అందుకోసం వెయ్యి కళ్లతో వెయిట్ చేస్తున్నారు.
కానీ వారి ఆశలపై, ఆతృతపై నీళ్లు చల్లారు తారక్. తాజాగా ఆయన ఫ్యామిలీతో కలిసి లాంగ్ టూర్ వెళ్లడమే అందుకు కారణం. దాదాపు నెల రోజులపాటు తారక్ అమెరికాలో విహారయాత్రని ఎంజాయ్ చేయబోతున్నారట. అక్కడ ఫ్యామిలీతో అందమైన ప్రదేశాలను తిలకించబోతున్నారని సమాచారం.
అయితే కొరటాల శివ సినిమా షూటింగ్ ప్రారంభమవడానికి ఇంకా సమయం పడుతుందనే కారణంతోనే ఆయన వెకేషన్కి వెళ్లారని తెలుస్తుంది. లేటెస్ట్ సమాచారం మేరకు NTR30 మూవీ వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభించనున్నారట. ఇంకా ఆల్మోస్ట్ మూడు నెలలు ఉన్న నేపథ్యంలో తారక్ ఇలా ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేసుకున్నారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.
ఎన్టీఆర్ చివరగా రాజమౌళి `ఆర్ఆర్ఆర్`లో రామ్చరణ్ తో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా మార్చిలో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. సుమారు రూ.1150కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ టాక్. ఆ తర్వాత తారక్ కొరటాల శివ చిత్రంలో నటించాల్సి ఉంది. కానీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాకపోవడంతో ఆలస్యం అవుతూ వస్తోంది. ఏడాది పాటు ఆలస్యం కావడమే ఇప్పుడు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈసినిమా కోసం వెయిట్ చేయడం ఓ టార్చర్ ఫీలింగ్లా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఇందులో హీరోయిన్గా జాన్వీ కపూర్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అలాగే `సీతారామం` ఫేమ్ మృణాల్ ఠాగూర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇందులో ఎవరు ఫైనల్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.