ఎన్టీఆర్ టాక్ షో..రెమ్యూనరేషన్ ట్విస్ట్! ఛానెల్ కు షాక్
First Published Dec 17, 2020, 7:06 AM IST
టీవి ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యాడు ఎన్టీఆర్. ఇప్పటికే స్టార్ మాలో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 1తో తెలుగుప్రేక్షకులను అలరించాడు ఎన్టీఆర్. ఎన్టీఆర్ షోకు హోస్ట్ గా వ్యవహరించడంతో మంచి సక్సెస్ అయింది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు తారక్. కాకపోతే కాస్త రిలీఫ్ గా ఉంటుందని గ్యాప్ తీసుకుని, ఎన్టీఆర్ మరోసారి టీవీ షోతో అందరి ఇండ్లలో సందడి చేయనున్నాడట. జెమినీ టీవీలో ప్రసారం కానున్న టాక్ షోకు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనున్నాడని తెలుస్తోంది.

అందుతున్న సమచారం మేరకు...మీలో ఎవరు కోటీశ్వరుడు లైన్స్ లో ఈ టాక్ షో సాగుతుందని సమాచారం. ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొంటూనే ఈ షో చేయనున్నాడట. ఈ షోకు ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తైందని సమాచారం

అంతేకాదు ఈ షో కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా ఓ సెట్ కూడా వేస్తున్నట్టు టాక్. దీనికోసం రెండు ఫ్లోర్ లను బుక్ చేసుకున్నాడట మేకర్స్. మరి దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?