ఫ్యాన్స్ ని మరోసారి డిజప్పాయింట్ చేసిన ఎన్టీఆర్.. కరోనా ఎలా సోకినట్టు?
ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ ని మరోసారి డిజప్పాయింట్ చేశాడు. దీంతో అభిమానులంతా ఆందోళన చెందున్నారు. ఓ వైపు తన అభిమాన హీరోకి కరోనా సోకడం, మరోవైపు బర్త్ డే వేళ సెలబ్రేషన్స్ లేకుండా చేయడంతో ఫ్యాన్స్ నిరాశలోకి వెళ్లిపోయారు.
ఈ నెల 20(మే20) ఎన్టీఆర్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన ఫ్యాన్స్ అప్పటి నుంచే సోషల్ మీడియా వేదికగా సెలబ్రేషన్స్ షురూ చేశారు. ట్విట్టర్లో నిన్న మోత మోగించారు. ఈ నెల 20 కోసం ఈగర్గా వెయిట్చేస్తున్నారు. గతేడాది కూడా కరోనా ప్రభావంతో బర్త్ డే సెలబ్రేషన్స్ కి దూరంగా ఉన్నారు.
ఇప్పుడు మరోసారి సరిగ్గా అదే సమయంలో కరోనా తీవ్రత పెరగడం ఓ షాక్ అయితే, ఏకంగా ఎన్టీఆర్కే కోవిడ్ 19 పాజిటివ్గా నిర్ధారణ కావడం మరో షాకింగ్ విషయం. దీంతో ఫ్యాన్స్ పూర్తి అసంతృప్తిలోకి వెళ్లిపోయారు.
అయితే ఆయన నటిస్తున్న `ఆర్ఆర్ఆర్` నుంచి కొత్త పోస్టర్ అయినా వస్తుందని అంతా భావించారు. రామ్చరణ్ బర్త్ డే సందర్భంగా ఆయన పోస్టర్ని విడుదల చేశారు. అలా ఎన్టీఆర్ పోస్టర్ వస్తుందని ఆశించారు. కానీ ఇప్పుడు కనీసం ఆ పోస్టర్ కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఇందులో ఎన్టీఆర్.. కొమురం భీమ్గా నటిస్తున్న విషయం తెలిసిందే.
కరోనా వల్ల చాలా మంది ఇతర హీరోలు తమ సినిమాల పోస్టర్స్, టీజర్లు విడుదలలను వాయిదా వేసుకుంటున్నారు. అలాంటప్పుడు రాజమౌళి టీమ్ అందరిని కాదని ఎన్టీఆర్ పోస్టర్ ని విడుదల చేసే ధైర్యం చేయకపోవచ్చు. దీంతో ఈ రకంగానూ ఫ్యాన్స్ కి నిరాశ తప్పడు. గతేడాది కూడా ఎన్టీఆర్ బర్త్ డేకి ఎలాంటి ట్రీట్ లేదు. ఆ తర్వాత ఎప్పటికో విడుదల చేశారు. ఈ సారి కూడా అదే పరిస్థితి నెలకొంది.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్కి కరోనా ఎలా సోకిందనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది. కారణంగా `ఆర్ఆర్ఆర్` షూటింగ్ని చాలా రోజుల క్రితమే నిలిపివేశారు. ఇరవై రోజులకు పైనే అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందని చెప్పినా, అందులో ఎన్టీఆర్ పాల్గొన లేదనే టాక్ వినిపిస్తుంది. మరి ఇంట్లోనే ఉన్న ఎన్టీఆర్కి కరోనా ఎలా వచ్చి ఉంటుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా, సస్పెన్స్ గా మారింది.
మరోవైపు ఎన్టీఆర్ `ఎవరు మీలో కోటీశ్వరులు` షోకి హోస్ట్ గా చేస్తున్నాడు. ఇది కరోనా కరోనా వల్ల వాయిదా పడింది. ఆ మధ్య షూటింగ్ చేశారని వినిపించింది. మరి అందులో షూటింగ్ టైమ్లో వచ్చిందా? లేక ఆయన ఇతర వ్యక్తులను ఎవరినైనా కలిశారా? అన్నది తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ `ఆర్ఆర్ఆర్`లో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. రామ్చరణ్ మరో హీరో. అలియా భట్, బ్రిటీష్ నటి ఒలీవియా మోర్రీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవగన్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి దానయ్య భారీ బడ్జెట్తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కరోనా వల్ల సినిమా షూటింగ్ని నిలిపివేశారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న, దసరా కానుకగా విడుదల చేయబోతున్నారు.