పాపం ఎన్టీఆర్, బన్నీ, చరణ్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. ఈ ఏడాది నిరాశే.. అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి?
కొత్త ఏడాది అంటే స్టార్ హీరోల సినిమాల అప్డేట్లు, రాబోయే సినిమాల కొత్త పోస్టర్లు, రిలీజ్ డేట్లు వంటి ఆసక్తికర అప్డేట్లు వస్తుంటాయి. కానీ స్టార్ హీరోలు అల్లు అర్జున్, ఎన్టీఆర్, చరణ్ అభిమానులకు మాత్రం డిజప్పాయింట్ చేసే విషయాలు తెలిశాయి.
కొత్త ఏడాది స్పెషల్గా అల్లు అర్జున్(Allu Arjun), రామ్చరణ్(Ram Charan) సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్లు లేవు. దీంతో కొంత అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు ఎన్టీఆర్ (NTR) సినిమాకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. కానీ అంతకు మించిన డిజప్పాయింట్మెంట్ తారక్ ఫ్యాన్స్ కి ఫేస్ చేయాల్సి వచ్చింది.
ఎన్టీఆర్ నెక్ట్స్ కొరటాల శివ దర్శకత్వంలో `NTR30` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అదిగో ఇదిగో అంటూ దాదాపు తొమ్మిది నెలలుగా ఆలస్యమవుతూ వస్తుంది. ఇప్పటికే ప్రారంభం కాలేదు. ప్రస్తుతం యూఎస్ వెకేషన్లో తారక్ ఉన్నారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో దర్శకుడు కొరటాల బిజీగా ఉన్నారు. ఎట్టకేలకు న్యూ ఇయర్(2023) సందర్బంగా సినిమా రిలీజ్ డేట్ని, సినిమా ప్రారంభానికి సంబంధించిన అప్డేట్ని ఇచ్చారు. వచ్చే ఏడాది(2024) ఏప్రిల్ 5న సినిమాని విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. ఫిబ్రవరిలో షూటింగ్ని స్టార్ట్ చేయబోతున్నారు.
NTR 30
అయితే ఇక్కడే తారక్ అభిమానులకు షాకిచ్చే అప్డేట్ కూడా వచ్చింది. ఈ ఏడాది ఎన్టీఆర్ థియేటర్లోకి రావడం లేదనే విషయాన్ని కన్ఫమ్ చేశారు. 2023లో ఎన్టీఆర్ని తెరపై చూడలేమనే విషయం అభిమానులకు కన్ఫమ్ అయ్యింది. దీంతో ఇప్పటికే అనేకసార్లు అసంతృప్తులకు గురైన ఫ్యాన్స్ కి ఇది పెద్ద షాకిచ్చే విషయమని చెప్పడంలో అతిశయోక్తి లేదు. తారక్ ఫ్యాన్స్ కిది పెద్ద లోటుగానే మిగిలిపోతుంది.
మరోవైపు అల్లు అర్జున్ సినిమా `పుష్ప2` (Pushpa2) నుంచి కూడా కొత్త ఏడాది సందర్భంగా ఎలాంటి అప్ఢేట్ లేదు. కనీసం షూటింగ్ డిటెయిల్స్ కూడా ప్రకటించలేదు. `పుష్ప2` అప్డేట్గానీ, ఫస్ట్ లుక్గానీ, వీడియో గ్లింప్స్ గానీ వస్తుందని ఆశించారు. డిసెంబర్లోనే ఉంటుందనే ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. కొత్త ఏడాది రోజు కూడా బన్నీ అభిమానులను ఖుషీ చేసే సర్ప్రైజ్ లేకపోవడంతో వాళ్లంతా కొంత నిరాశతో ఉన్నారు.
దీనికితోడు మరో డిజప్పాయింట్ చేసే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటిస్తున్న `పుష్ప2` చిత్రం ఈ ఏడాది రిలీజ్ కావడం లేదట. వచ్చే ఏడాది(2024)లోనే థియేటర్లోకి రానుందట. వచ్చే ఏడాది సమ్మర్లో వచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. మధ్య మధ్యలో చాలా గ్యాప్లు తీసుకోవడం జరుగుతుంది. స్క్రిప్ట్ పరంగా, లొకేషన్ల విషయంలో కొంత ఆలస్యమవుతుందని, అందుకే కంటిన్యూగా చిత్రీకరణ జరగడం లేదని సమాచారం. మొత్తానికి ఈ ఏడాది బన్నీ థియేటర్లోకి రావడం లేదనే సమాచారంతో పుష్పరాజ్ ఫ్యాన్స్ షాక్లో ఉన్నారని టాక్. ఇందులో రష్మిక (Rashmika) కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.
వీరితోపాటు మరో స్టార్ రామ్చరణ్ పరిస్థితి కూడా అదే అని లేటెస్ట్ టాక్. ప్రస్తుతం చరణ్.. శంకర్ దర్శకత్వంలో `RC15`లో నటిస్తున్నారు. చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రమిది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఏపీలో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో షూటింగ్ చేస్తున్నారు.
ఈ సినిమాని ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ లేటెస్ట్ సమాచారం మేరకు పోస్ట్ పోన్ కాబోతుందట. వచ్చే ఏడాది (2024) సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో నిర్మాత దిల్రాజు ఉన్నట్టు సమాచారం. సంక్రాంతికి వస్తే కలెక్షన్ల పరంగా వేరే రేంజ్ ఉంటుందని దిల్రాజు ఆలోచిస్తున్నట్టు టాక్. దీంతో ఈ ఏడాది చరణ్ కూడా రావడం లేదు. ఓ రకంగా ఆయన అభిమానులకు షాకిచ్చే విసయమే. దీంతో వారంతా డిజప్పాయింట్ లో ఉన్నారని టాక్. మిగిలిన హీరోలేమో ఒకటి, రెండు సినిమాలతో ఆల్రెడీ రిలీజ్ డేట్లు కన్ఫమ్ చేసుకున్నారు. ఈ ముగ్గురు హీరోలు మాత్రం ఈ ఏడాది అభిమానులను నిరాశ పర్చబోతున్నారని సమాచారం.