షారూఖ్కి నో చెప్పిన నయనతార.. కారణం ఏంటో తెలుసా?
షారూఖ్ ఖాన్.. బాలీవుడ్ బాద్షా. నయనతార లేడీ సూపర్ స్టార్. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో హీరోలకు దీటుగా రాణిస్తుంది. వీరిద్దరు కలిసి తెరని పంచుకుంటే నిజంగానే అదో క్రేజీ మూవీ అయి ఉండేది. అలాంటి అవకాశం నయనతారకి వచ్చింది. కానీ దాన్ని తిరస్కరించిందట. మరి ఆ విశేషాలేంటో చూస్తే..
నయనతార దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా రాణిస్తుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో మెప్పిస్తుంది. స్టార్ హీరోలకు దీటుగా కలెక్షన్లని రాబడుతూ సత్తా చాటుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం అనే తేడా లేకుండా దూసుకుపోతుంది.
అయితే నయనతారకి గతంలో బాలీవుడ్ బాద్షా షారూఖ్తో నటించే అవకాశం వరించింది. `బ్లాక్ బస్టర్గా నిలిచిన `చెన్నై ఎక్స్ ప్రెస్` చిత్రంలో నయనతారకి ఆఫర్ వచ్చింది.
అయితే అందులో హీరోయిన్ పాత్ర కోసం కాదు. ఐటెమ్ సాంగ్ కోసం. కానీ నయన్ దీన్ని తిరస్కరించిందట. తాను `వన్ టూ త్రీ ఫో.. `అనే సాంగ్లో నటించలేనని తేల్చి చెప్పిందట.
మరి షారూఖ్తో నయన్ నటించకపోవడానికి కారణమేంటనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే ఆ విషయాన్ని నయన్ కూడా చెప్పలేదు. స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న తనని ఆడియెన్స్ తప్పుగా అర్థం చేసుకుంటారేమో అన్న సందేహంతో నో చెప్పినట్టు సమాచారం. దీంతో ఆ పాటని ప్రియమణితో చేయించారు.
ఇదిలా ఉంటే షారూఖ్ ఖాన్, దీపికా పదుకొనె జంటగా నటించిన ఈ సినిమా నాలుగు వందల కోట్లకు పైగా కలెక్షన్లని రాబట్టింది. రోహిత్ శెట్టి దీనికి దర్శకత్వం వహించారు.
ఇక షారూఖ్ ఖాన్ బాలీవుడ్లో సూపర్ స్టార్గా రాణిస్తున్నారు. ఖాన్ త్రయంలో ఒకరిగా, తిరుగులేని ఇమేజ్తో, ఫ్యాన్ ఫాలోయింగ్తో మెప్పిస్తున్నారు.
తన రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఆయన ప్రస్తుతం `పఠాక్` చిత్రంలో నటిస్తున్నారు. ఇది త్వరలో ప్రారంభం కానుంది.
మరోవైపు నయనతారం ప్రస్తుతం అరడజన్ సినిమాలు చేస్తుంది. అందులో రజనీకాంత్ `అన్నాత్తే` కూడా ఉండటం విశేషం.