అవకాశాల కోసం అందాలను ఎరగా వేస్తున్న బాలకృష్ణ హీరోయిన్
మాజీ మిస్ కేరళ.. బాలకృష్ణ హీరోయిన్ నటాషా దోషి క్యూట్ అందాలతో మత్తెక్కిస్తుంది. ఇన్నాళ్ళు ఓ మోస్తారు అందాలతో అలరించిన ఈ బ్యూటీ తాజాగా రెచ్చిపోయింది. అందాల విందుకు తెరలేపింది.
ముంబయికి చెందిన ఈ హాట్ బ్యూటీ టీనేజ్ నుంచే కెరీర్ని ప్రారంభించింది. యాక్టింగ్ క్లాసులకు వెళ్ళింది. నటనపై పట్టు సంపాదించింది.
మోడల్గా కెరీర్ ప్రారంభించింది 2010లో మిస్ కేరళగా నిలిచి అవార్డుని అందుకుంది.
రెండేళ్ళకి హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
మలయాళ చిత్ర పరిశ్రమ `మంత్రికన్` సినిమాతో హీరోయిన్గా వెండితెరకు పరిచయం అయ్యింది. జయరామ్, పూనమ్ బజ్వా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది.
అదే ఏడాది మలయాళంలోనే `హైడ్ ఎన్ సీక్` లో మెరిసింది. థ్రిల్లర్ ప్రధానంగా సాగిన ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత నటించిన `కాల్ మీ ఎట్`, `కప్పుసినో` చిత్రాల్లో నటించగా, అవి పెద్దగా ఆడలేదు. దీంతో నటాషాకి అవకాశాలు కూడా ముఖం చాటేశాయి.
ఇంతలోనే తెలుగులో నటించే అవకాశం నటాషాని వరించింది. ఏకంగా బాలకృష్ణ సరసన నటించే ఛాన్స్ కొట్టేయడం విశేషం.
బాలకృష్ణ, నయనతార జంటగా వచ్చిన `జై సింహా`లో ఓ హీరోయిన్గా మెరిసింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద అంతగా మెరవకపోవడం, నటాషా పాత్రకి అంతగా ప్రయారిటీ లేకపోవడంతో నటాషాకి బాలయ్యతో నటించినా ప్రయోజనం లేకుండా పోయింది.
ఆ తర్వాత నటాషా `కోతలరాయుడు` లో హీరోయిన్గా ఎంపికైంది. ఈ సినిమాపై ఇంకా స్పష్టత లేదు.
ఇదిలా ఉంటే తాజాగా హాట్ ఫోటోలతో రెచ్చిపోయింది నటాషా. ఎద అందాలను ఎరగా వేస్తూ సెక్సీ లుక్స్ లో ఫోటోలకు పోజులిచ్చింది.
ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లలో హీటు పుట్టిస్తుంది.
అవకాశాల కోసం తన గ్లామర్ షోకి తెరలేపింది. విభిన్న కోణాల్లో కనిపిస్తూ మేకర్స్ ఎర వేసింది. ఆమె అందాలకైనా ముగ్దులై అవకాశాలిస్తారేమో చూడాలి.