బిగ్బాస్ బ్యూటీ మినిషా లంబాని ఎంత ఆరబోసినా పట్టించుకోవడం లేదట!
`బిగ్బాస్` షోతో పాపులర్ అయ్యింది మినిషా లంబా. మరోవైపు `కార్పొరేట్`, `జోకర్`, `కిడ్నాప్` చిత్రాలతో మెస్మరైజ్ చేసిన మినిషాని హిందీ మేకర్స్ పట్టించుకోవడం లేదట. సోషల్ మీడియాలో ఈ అమ్మడు అన్ లిమిటెడ్గా అందాలు ఆరబోసినా ఎందుకో ఛాన్స్ లివ్వడం లేదని వాపోతుంది. నేడు(సోమవారం) పుట్టిన రోజు జరుపుకుంటోన్న ఈ సెక్సీ బ్యూటీ పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది.
ఢిల్లీకి చెందిన ఈ అందాల ముద్దుగుమ్మ మోడల్గా కెరీర్ని ప్రారంభించింది. పలు యాడ్స్ లో మెరిసి ఆకట్టుకుంది. చదువుకుంటూనే మోడలింగ్ చేసి తనేంటో నిరూపించుకుంది.
క్యాడ్బర్రీ యాడ్ షూటింగ్ టైమ్లో దర్శకుడు సుజిత్ సిర్కర్ ఆమెని అప్రోచ్ అయ్యారు. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో `యహాన్` చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయ్యింది.
వరుసగా మధుర్ భండార్కర్ `కార్పొరేట్`, `రాకీః ది రెబల్`, `ఆంటోని కౌన్ హై`, `హానీమూన్ ట్రావెల్స్ ప్రై. లి`, అనామిక`, `శౌర్య`, `దస్ కహనియాన్` చిత్రాల్లో నటించి మెప్పింది.
2008లో వచ్చిన `బచ్నా ఏ హసీనో` చిత్రం పెద్ద విజయం సాధించిన తనకు మంచి గుర్తింపుని తీసుకొచ్చింది. ఈ క్రమంలో సంజయ్ దత్ తో `కిడ్నాప్`, అలాగే `వెల్ డన్ అబ్బా`, అక్షయ్ కుమార్ తో `జోకర్` చిత్రాల్లో నటించి మెప్పించింది.
ఈ అమ్మడు హీరోయిన్గానే కాదు, ఇతర సైడ్ రోల్స్ కూడా చేసింది. దీంతో అందరి దృష్టిలో సైడ్ యాక్టర్గానే ముద్ర పడింది. హీరోయిన్గా అవకాశాలు రాకపోవడానికి ఇది కూడా ఓ కారణమనే టాక్ ఉంది.
దీంతో ఎంత అందాలు ఆరబోసినా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. మార్కెట్లో ఇమేజ్ కూడా ముఖ్యమనే విషయం ఈ హాట్ భామకి అర్థంకానట్టుంది. అయితే హీరోయిన్గానే కాదు నటిగా అన్ని రకాల పాత్రలు పోషించాలనేది మినిషా ఆలోచన. చివరగా మినిషా సంజయ్ దత్ `భూమి`లో మెరిసింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి సినిమా అవకాశాలే లేవు.
మరోవైపు టెలివిజన్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. పలు సీరియల్స్ లోనూ నటించింది. 2014లో `బిగ్బాస్` ఎనిమిదో సీజన్లో కంటెస్టెంట్గా మెరిసింది. దీని ద్వారా బాగానే గుర్తింపు తెచ్చుకుంది.
దీంతోపాటు `చూనా హై ఆస్మాన్`, `కామెడీ నైట్ బచ్చావో`, `తెనాలి రామా`, `ఇంటర్నెట్ వాలా లవ్` సీరియల్స్ లో నటించి బుల్లితెర ఆడియెన్స్ ని అలరించింది.
ఇప్పుడు సినిమాలే కాదు, టీవీ అవకాశాలు కూడా లేవు. ఈ క్రమంలో ప్రస్తుతం వెబ్ సిరీస్ చేస్తుందట. `కుతుబ్ మినార్` అనే సినిమాతో మళ్లీ ఆడియెన్స్ ముందుకు రాబోతున్నట్టు చెప్పింది.
పుట్టిన రోజు సందర్భంగా మినిషా లంబా చెబుతూ, `నేను ఈస్థాయి ఎదిగేందుకు కారణమైన నా తల్లిదండ్రులకు ధన్యవాదాలు. ప్రతి బర్త్ డే నాకు బోలెడన్ని గిఫ్ట్స్ వచ్చేవి. ఎవరెవరు ఏమిచ్చారో అమ్మ రాసిపెట్టేవారు. దాన్ని బట్టే మనం కూడా తిరిగి గిఫ్ట్స్ ఇవ్వాలని చెప్పేది. నా చిన్నప్పుడు పుస్తకాలు, బట్టలు గిఫ్ట్ గా వస్తే అస్సలు నచ్చేవి కాదు. కానీ ఇప్పుడు అవే బహుమతులు ఇతరులకు పంచుతుంటే సంతోషంగా ఉంది.
`కాలం అన్నింటిని మార్చేస్తుంది. ఇప్పటి వరకు వచ్చిన గిఫ్ట్స్ లో నాకు అత్యంత విలువైనది ఈ బుక్ రీడర్. ఎందుకంటే దాన్ని నేను ఎక్కడకు వెళ్లినా నా వెంట తీసుకెళ్లవచ్చు. బాల్యంలో బర్త్ డే అంటే సంబరపడేదాన్ని, ఇప్పుడు మాత్రం సిగ్గేస్తుంది. పార్టీలో యాభై మంది కన్నా ఎక్కువ ఉంటే నాకు అసలు సౌకర్యవంతంగానే అనిపించద`ని చెప్పింది.
ఇటీవల తనకు సినిమా అవకాశాలు రావడం లేదని వాపోయింది. డిటిజల్ ఫ్లాట్ఫామ్ వచ్చాక బోలెడంత స్పేస్ దొరికింది. కంటెంట్ బాగుంటే అందరు ఆదరిస్తారని, త్వరలో `కుతుబ్ మినార్` చిత్రం ద్వారా మమ్మల్ని ఎంటర్టైన్ చేయనున్నాను. ఇది సమ్మర్లో ఓటీటీలో విడుదలవుతుంది` అని చెప్పింది.
మినీషా నటి పూజా బేడీ సోదరుడు రియాన్ను 2015లో వివాహం చేసుకుంది. గతేడాది వీరిద్దరు విడాకులు తీసుకున్నారు.