ఫస్ట్ టైమ్ మెగాస్టార్ చిరంజీవి అలా.. ఫ్యాన్స్ కి పండగే..
మెగాస్టార్ చిరంజీవి టీవీ షోస్లో పాల్గొన్నాడు. కానీ ఇలా మాత్రం ఎప్పుడూ కనిపించలేదు. కానీ ఫస్ట్ టైమ్ తన అభిమానులను సందడి చేయబోతున్నారు. వారిని మరోలా ఖుషీ చేయబోతున్నాడు. అందుకు క్రిస్మస్ని వేదికగా చేసుకున్నారు. మరి చిరు ఇచ్చే ట్రీట్ ఏంటీ? అనేది చూస్తే..
చిరంజీవి ఫస్ట్ టైమ్ ఓ టాక్ షోలో పాల్గొంటున్నాడు. అదే `సామ్జామ్` టాక్ షో కావడం విశేషం.
సమంత వ్యాఖ్యాతగా నిర్వహించే `సామ్జామ్` టాక్ షోలో చిరంజీవి పాల్గొనబోతున్నట్టు ప్రారంభంలో తెలిపిన విషయం తెలిసిందే.
తాజాగా ఆ టైమ్ వచ్చింది. చిరంజీవి పాల్గొన్న ఎపిసోడ్ ప్రసారం కాబోతుంది.
ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా చిరంజీవి పాల్గొన్న ఎపిసోడ్ ప్రసారం కానుంది. అయితే ఓటీటీ ఫ్లాట్ఫామ్ అయిన `ఆహా`లో ఇది ప్రసారం కానుంది. ఓటీటీ కోసం చిరంజీవి కదిలిరావడం ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్పొచ్చు.
తాజాగా ఆదివారం ఈ విషయాన్ని ప్రకటించారు.
సమంతతో చిరంజీవి ఎలాంటి విషయాలు పంచుకోబోతున్నాడు, సమంత చిరు నుంచి కొత్తగా ఎలాంటి విషయాలను రాబట్టబోతుందనేది ఇప్పుడు ఆసక్తి నెలకొంది.
ఈ `సామ్జామ్` షోలో ఇప్పటికే విజయ్ దేవరకొండ, నాగ్ అశ్విన్, రానా, సైనా నెహ్వాల్, కశ్యప్ పాల్గొన్నారు.
ప్రస్తుతం అల్లు అర్జున్ పాల్గొన్న ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఆ తర్వాత చిరు ఎపిసోడ్ ప్రసారం కానుంది. అంతేకాదు సమంత భర్త, హీరో నాగచైతన్య కూడా ఈ షోలో పాల్గొనబోతుండటం విశేషం.