పిల్లలతో కలిసి న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్న మహేష్..వాహ్ (ఫోటోస్)
కొత్త సంవత్సరం వేళ అందరి ఇళ్లల్లో సందడి నెలకొంది. అయితే గతంతో పోల్చితే అది కాస్త తక్కువే అని చెప్పొచ్చు. సూపర్ స్టార్ మహేష్బాబు తన ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ 2021ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందులో నమ్రత, సితార, గౌతమ్తోపాటు ఇతర బంధువులున్నారు. ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
మహేష్ కొత్త సంవత్సరాన్ని అర్థరాత్రి తన ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా నమ్రత తమ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.
ఇందులో మహేష్తోపాటు నమ్రత, కూతురు సితార, కుమారుడు గౌతమ్ ఉన్నారు.
వీరితోపాటు ఇతర బంధువులు, వారి పిల్లలు కూడా కనిపిస్తుంది.
వీరింతా కేక్ కట్ చేసి తమ పరిధిలో చాలా ఉత్సాహంగా కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకున్నట్టు ఫోటోలు చూస్తే అర్థమవుతుంది.
తన స్నేహితురాలితో మహేష్ ముద్దుల తనయ సితార. ఈ సందర్భంగా నమ్రత స్పందిస్తూ, మనం గత సంవత్సరంలో వదిలిపెట్టిన దానికంటే మంచి విషయాలు ముందున్నాయి. 2020 సహనం, స్నేహం, మనం చుట్టూ ఉన్నవారితో కృతజ్ఞతాభావంతో ఉండటం వంటివి మనకు నేర్పించింది. నూతన సంవత్సరం వేళ అంతా మంచి ఆరోగ్యం, ఆనందం, శ్రేయస్సుతో ఉండాలని కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా 2021కి స్వాగతం. సురక్షితంగా ఉండండి` అని పేర్కొంది.
న్యూ ఇయర్కి ఒక్క రోజు ముందు తమ పిల్లలు సితార, గౌతమ్లతో మహేష్. ఇందులో దర్శకుడు మెహర్రమేష్ తనయ మోను కూడా ఉంది.
ఇటీవల మహేష్ తన ఫ్యామిలీతో కలిసి క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే.