ఆగలేని సంసారాలు చేస్తారా..? లాక్ డౌన్ పెళ్లిళ్లపై హీరోయిన్ హాట్ కామెంట్స్
లాక్ డౌన్ కారణంగా జన జీవనం స్థంభించిపోయింది. ప్రజలు ఒక దగ్గర గుమిగూడే పరిస్థితి లేకపోవటంతో చాలా మంది పెళ్లిల్ల వంటి శుభకార్యాలను వాయిదా వేసుకున్నారు. మరికొందరు ప్రభుత్వ నిబంధనలకు లోబడి తగు జాగ్రత్తలు తీసుకుంటూ పెళ్లిల్లు చేసుకుంటున్నారు. తాజాగా యంగ్ హీరో నిఖిల్ కూడా లాక్ డౌన్లోనే పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇలాంటి పెళ్లిల్లపై నటి మాధవీ లత సంచలన వ్యాఖ్యలు చేసింది.
నటి మాధవి లత వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. తనకు సంబంధం ఉన్నా లేకపోయినా ఏదో ఒక వివాదంలో తల దూర్చేసి కాంట్రవర్షియల్ కామెంట్స్తో రెచ్చిపోతోంది. రాజకీయాల్లోనూ సత్తా చాటాలనుకుంటున్న ఈ బ్యూటీ వివాదాస్పద వ్యాఖ్యలతో రెచ్చిపోతోంది.
ఇటీవల యామిని సాధినేని బీజేపీ పార్టీలో చేరిన సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మాధవి లత. మల్లెపూలు బాగా నలిపిందని పార్టీలోకి తీసుకున్నారా అంటూ ఈ భామ చేసిన కామెంట్స్ రాజకీయా, సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి.
మరో వివాదాస్పద నటి శ్రీరెడ్డితో మాధవి లత వివాదం చాలా కాలంగా సాగుతోంది. ఈ ఇద్దరు హద్దులు దాటి విమర్శించుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.
గతంలో ఒక సారి తనకు చచ్చిపోవాలని ఉంది అంటూ సంచలన పోస్ట్ చేసి అందరినీ కలవరపెట్టింది మాధవి లత. ఈ పోస్ట్ వైరల్ కావటంతో తరువాత నా కామెంట్ను ఫాలోవర్స్ తప్పుగా అర్ధం చేసుకున్నారంటూ సర్థి చెప్పే ప్రయత్నం చేసింది.
తాజాగా మరోసారి తనదైన స్టైల్ లో కామెంట్స్ చేసింది. గురువారం యంగ్ హీరో నిఖిల్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ అందరూ మాస్క్లు ధరించి అతి తక్కువ మంది అతిధుల మధ్య పెళ్లి చేసుకున్నాడు నిఖిల్.
అయితే నిఖిల్ పేరు ప్రస్తావించకపోయినా అలా లాక్డౌన్లో పెళ్లిళ్లు చేసుకోవటంపై స్పందించిన మాధవి లత. అస్సలు ఆగట్లేదుగా జనాలు మాస్కలు వేసుకొని పెళ్లిల్లు ఎందుకు అంటూ ప్రశ్నించింది.
ముహూర్తం మళ్లీ రాదా..? ఇది పోతే శ్రావణం, కాకపోతే మాఘ మాసం లేకుంటే మరో వన్ ఇయర్..? పిల్ల దొరకదా పిల్లోడు మారిపోతాడా..? అలా మారిపోయే మనుషులతో బంధాలు ఎందుకట.?. మాస్క్ ముసుగులో పెళ్లి అవసరమా..? కొన్నాళ్లు ఆగలేని సంసారాలు చేస్తారా.?ఫిక్స్ అయిన మ్యారేజ్లో గ్యాప్ వస్తే నిజాలు తెలిసే బంపర్ ఆఫర్ మిస్ అవుతున్నారు. సచ్చిపోతున్నార్రా నాయనా అంటే ఈ పెళ్లి ఏందో..? అంటూ కామెంట్ చేసింది.
అంతేకాదు తన కామెంట్ తో పాటు డిస్ క్లైమర్ లా.. `నా పోస్ట్ నా ఇష్టం.. నా ఒపీనియన్ నా ఇష్టం. నాకు నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసే హక్కు ఉంది` అంటూ కామెంట్ చేసింది. మరి ఈ కామెంట్స్పై నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు.