ఇవ్వాళ కృష్ణ - ఇందిరా దేవి పెళ్లిరోజు.. అందుకేనా మమ్మల్ని విడిచిపెట్టారు నాన్న అంటూ.. కూతురు మంజుల భావోద్వేగం!
నట శేఖరుడు, టాలీవుడ్ సీనియర్ నటుడు, దివంగత సూపర్ స్టార్ కృష్ణ లేరనే చేధునిజాన్నికూతురు మంజుల ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈరోజు కృష్ణ - ఇందిరా దేవి పెళ్లిరోజు కావడంతో మరింతగా భావోద్వేగమైంది.
టాలీవుడ్ నటుడు, నట శేఖరుడు, దివంగత సూపర్ స్టార్ కృష్ణ (Krishna) ఈనెల 15న కన్నుమూసిన విషయం తెలిసిందే. స్వల్ప గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరిన కృష్ణ కోలులేకపోయారు. ఆరోగ్యం విషమించి తిరిగి రాని లోకాలు వెళ్లిపోయాడు.
ఒక్క ఏడాదిలోనే మహేశ్ బాబు ఇంట మూడు విషాదాలు చోటుచేసుకోవడం బాధాకరం. ఈఏడాది జనవరిలో అన్న రమేశ్ బాబు చనిపోగా.. తల్లి ఇందిరా దేవి (Indira Devi) సెప్టెంబర్ 28న కన్నుమూశారు. ఇంకా ఆ బాధనుంచి కోలుకోకముందే తండ్రి కృష్ణ కూడా తుదిశ్వాస విడిచారు.
ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న ముగ్గురిన్ని కోల్పోవడంతో మహేశ్ బాబుతో పాటు సోదరి మంజుల ఘట్టమనేని కూడా శోకసంద్రంలో మునిగిపోయారు. తల్లిదండ్రులను కోల్పోయిన బాధ నుంచి తేరుకోలేకపోతున్నారు. తాజాగా మంజుల ఘట్టమనేని (Manjula Ghattamaneni) చేసిన పోస్ట్ అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
ఇవ్వాళ కృష్ణ - ఇందిరా దేవి పెళ్లిరోజుకావడంతో మంజుల భావోద్వేగంగా స్పందించింది. తల్లిదండ్రులకు వివాహా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ గతంలో చివరిగా వెడ్డింగ్ డేను సెలబ్రేట్ చేసిన హార్ట్ టచ్చింగ్ ఫొటోలను షేర్ చేసింది. ఈ సందర్భంగా ఎమోషనల్ నోట్ ను కూడా రాసింది మంజుల ఘట్టమనేని.
నోట్ లో.. ‘వారి ప్రత్యేక వివాహం స్వర్గంలోనూ కొనసాగుతుందని భావిస్తున్నాను. అమ్మ వెళ్ళిన తర్వాత, నాన్న ఆమెను చాలా మిస్ అయ్యాడని నేను అనుకుంటున్నాను. అతను ఆమెను చేరడానికే మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లాడు. వారు నిజంగా ఒకరికొకరు ఆత్మ సహచరులు.వారి వివాహం 60 సంవత్సరాలు మరియు 5 మంది పిల్లలతో సాగిన ప్రేమ ప్రయాణం.
ఇలాంటి మంచి మనసున్న వ్యక్తులు నాకు తల్లిదండ్రులుగా ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. బేషరతు ప్రేమతో వారు ఎల్లప్పుడూ మనకు అండగా ఉంటారని ఆశిస్తున్నాను. కనీసం 10 శాతం స్వచ్ఛతతో వారిలా మారడమే మనం వారికి ఇవ్వగల ఉత్తమ బహుమతిగా నేను భావిస్తున్నాను.’ అని పేర్కొంది. ఇక కృష్ణ అభిమానులు కూడా ఆయన్ను మరిచిపోలేకపోతున్నారు. నిత్యం సోషల్ మీడియాలో ఏదోలా గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.